ETV Bharat / state

తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

author img

By

Published : Jul 14, 2021, 8:22 PM IST

Updated : Jul 14, 2021, 9:46 PM IST

State Food Processing Policy
State Food Processing Policy

20:18 July 14

తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుతో పాతికవేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని... 70 వేల మందికి ప్రత్యక్షంగా, మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. మొదటి దశలో పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని... రానున్న మూడేళ్ళలో  పది వేల ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహికులకు రాయితీలను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, రైతుసంఘాలు, స్వయంసహాయక సంఘాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర  వేసింది.

 రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ధాన్యం, పంటల దిగుబడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రంగంలో సుమారు పాతిక వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష, మూడు లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, 500 ఎకరాలకు తగ్గకుండా వెయ్యి ఎకరాల వరకు 2024 -2025 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

అన్ని జోన్లలో మౌలిక వసతుల కల్పన

  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఈ విధానంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా  ప్రోత్సాహకాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు భూమి కేటాయించాలని నిర్ణయించారు. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ప్లగ్ అండ్ పే పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యాన్ని పెంచే దిశగా  ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలుకు అధికారులను అదేశించారు. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఆర్థిక ప్రోత్సాహకాలు

  ఫుడ్ ప్రాసెసింగ్  జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్​గా గుర్తించి ఎలాంటి జనావాసాలు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ గడువును నెలాఖరు వరకు  పొడిగించారు. సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగినందున వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్థక, పాడి, మత్స్య రంగాల్లో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెస్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం లభిస్తుందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన, వాల్యూ చైన్ కొనసాగేలా ఉత్పత్తిదారులు,  రైతుసంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి పెరిగి రాష్ట్రంలోని గ్రామీణ, మారుమూల, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో  అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. 
 

విదేశీ ఎగుమతి యూనిట్లకు ప్రోత్సాహకం

రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో స్థాపించే యూనిట్లకు ఇచ్చే  రాయతీలను కేబినెట్ ఖరారు చేసింది. ప్రతి యూనిట్​కు రెండు రూపాయల చొప్పున ఐదేళ్ల వరకు విద్యుత్ రాయితీ అందించనున్నారు. పెట్టుబడి కోసం రెండు కోట్లకు మించకుండా తీసుకునే టర్మ్ లోన్ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని రీఎంబర్స్ చేయాలని నిర్ణయించారు.మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును ఏడేళ్ల వరకు 100 శాతం రీఎంబర్స్ మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఆహార ఉత్పత్తులను స్టోరేజీకి తరలింపు, తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.ఈ ప్రోత్సాహకాలకు అదనంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 20 లక్షలకు మించకుండా15 శాతం మూలధనాన్ని మంజూరు చేస్తారు. మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రెండు కోట్లకు మించకుండా రీయంబర్స్ మెంట్ చేస్తారు. అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధరపై 20 లక్షలకు మించకుండా 33 శాతం రాయతీ ఇస్తారు. స్వయం సహాయక సంఘాలు రైతు సంఘాలకు కూడా అదనపు ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. సాధారణ ప్రోత్సహకాలకు అదనంగా కోటి మించకుండా15 శాతం మూల ధనం మంజూరు చేస్తారు. మూలధనం లోన్​పై చెల్లించాల్సిన రెండు కోట్ల వడ్డీకి మించకుండా వడ్డీలోని పది శాతం రీఎంబర్స్ మెంట్ చేస్తారు. భూమి విలువ మీద 20 లక్షలకు మించకుండా 33 శాతం వరకు రాయతీ అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇదీ చూడండి: ఆయిల్ పామ్‌ సాగుకు ప్రోత్సాహం.. రైతులకు రాయితీ

20:18 July 14

తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుతో పాతికవేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని... 70 వేల మందికి ప్రత్యక్షంగా, మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. మొదటి దశలో పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని... రానున్న మూడేళ్ళలో  పది వేల ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహికులకు రాయితీలను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, రైతుసంఘాలు, స్వయంసహాయక సంఘాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర  వేసింది.

 రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ స్టేట్​ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ధాన్యం, పంటల దిగుబడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రంగంలో సుమారు పాతిక వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష, మూడు లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, 500 ఎకరాలకు తగ్గకుండా వెయ్యి ఎకరాల వరకు 2024 -2025 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

అన్ని జోన్లలో మౌలిక వసతుల కల్పన

  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఈ విధానంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా  ప్రోత్సాహకాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు భూమి కేటాయించాలని నిర్ణయించారు. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ప్లగ్ అండ్ పే పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యాన్ని పెంచే దిశగా  ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలుకు అధికారులను అదేశించారు. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఆర్థిక ప్రోత్సాహకాలు

  ఫుడ్ ప్రాసెసింగ్  జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్​గా గుర్తించి ఎలాంటి జనావాసాలు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ గడువును నెలాఖరు వరకు  పొడిగించారు. సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగినందున వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్థక, పాడి, మత్స్య రంగాల్లో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెస్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం లభిస్తుందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన, వాల్యూ చైన్ కొనసాగేలా ఉత్పత్తిదారులు,  రైతుసంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి పెరిగి రాష్ట్రంలోని గ్రామీణ, మారుమూల, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో  అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. 
 

విదేశీ ఎగుమతి యూనిట్లకు ప్రోత్సాహకం

రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో స్థాపించే యూనిట్లకు ఇచ్చే  రాయతీలను కేబినెట్ ఖరారు చేసింది. ప్రతి యూనిట్​కు రెండు రూపాయల చొప్పున ఐదేళ్ల వరకు విద్యుత్ రాయితీ అందించనున్నారు. పెట్టుబడి కోసం రెండు కోట్లకు మించకుండా తీసుకునే టర్మ్ లోన్ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని రీఎంబర్స్ చేయాలని నిర్ణయించారు.మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును ఏడేళ్ల వరకు 100 శాతం రీఎంబర్స్ మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఆహార ఉత్పత్తులను స్టోరేజీకి తరలింపు, తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.ఈ ప్రోత్సాహకాలకు అదనంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 20 లక్షలకు మించకుండా15 శాతం మూలధనాన్ని మంజూరు చేస్తారు. మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రెండు కోట్లకు మించకుండా రీయంబర్స్ మెంట్ చేస్తారు. అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధరపై 20 లక్షలకు మించకుండా 33 శాతం రాయతీ ఇస్తారు. స్వయం సహాయక సంఘాలు రైతు సంఘాలకు కూడా అదనపు ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. సాధారణ ప్రోత్సహకాలకు అదనంగా కోటి మించకుండా15 శాతం మూల ధనం మంజూరు చేస్తారు. మూలధనం లోన్​పై చెల్లించాల్సిన రెండు కోట్ల వడ్డీకి మించకుండా వడ్డీలోని పది శాతం రీఎంబర్స్ మెంట్ చేస్తారు. భూమి విలువ మీద 20 లక్షలకు మించకుండా 33 శాతం వరకు రాయతీ అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇదీ చూడండి: ఆయిల్ పామ్‌ సాగుకు ప్రోత్సాహం.. రైతులకు రాయితీ

Last Updated : Jul 14, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.