ETV Bharat / state

రాష్ట్రంలో కమల దళపతి పీఠం దక్కేదెవ్వరికీ...?

author img

By

Published : Nov 28, 2019, 5:35 AM IST

Updated : Nov 28, 2019, 11:21 AM IST

రాష్ట్రంలో కమల దళపతి ఎంపిక ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై రాష్ట్ర, జిల్లా నేతల నుంచి రెండు దఫాలుగా అభిప్రాయాలు సేకరించారు. పదిమందికి పైగా ఈ పదవిని ఆశిస్తున్నప్పటికీ... ప్రధాన రేసు మాత్రం ముగ్గురు నేతల మధ్యే నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా...? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

TELANGANA BJP NEW PRESIDENT SELECTION PROCESS
TELANGANA BJP NEW PRESIDENT SELECTION PROCESS


రాష్ట్రంలో కమల దళపతి ఎంపికపై పార్టీ శ్రేణుల నుంచి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కృష్ణదాస్‌ ఇప్పటికే అభిప్రాయాలు స్వీకరించారు. ఎక్కువ మంది రాష్ట్ర నేతలు ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్​ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రెండో దఫా అభిప్రాయ సేకరణలో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కమల దళపతి పీఠం దక్కేదెవ్వరికీ...?

దిల్లీ స్థాయిలో మంతనాలు....

మరోవైపు అధ్యక్ష పదవి కోసం దిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేరు ఒక దశలో గట్టిగా వినిపించినా... తొలిసారి ఎంపీగా గెలిచినందున పార్టీ రాష్ట్ర బాధ్యతల్ని చేపడితే.. నియోజకవర్గంలో పట్టు తగ్గిపోతుందని వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ఆశావాదుల వినతులు...

పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నేతలు సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్‌ ప్రభాకర్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తమకూ అవకాశం ఇవ్వాలని రఘునందన్‌రావు, కృష్ణసాగర్‌రావు పార్టీ ఇన్​ఛార్జి కృష్ణదాస్‌ను కలిసి కోరారు.

మరోసారి లక్ష్మణ్​కేనా...?

3 రోజుల క్రితం దిల్లీకి వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.... జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్ర అధ్యక్షునిగా మూడేళ్ల పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ టికెట్‌ ఆశించి దక్కని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిస్తోంది. బీసీ సామాజికవర్గం, పార్టీలో సీనియర్‌ నేత వంటి అంశాలు కలిసివస్తాయని... మరోసారి అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని లక్ష్మణ్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు.

డిసెంబర్​ చివరివరకు...

బీసీ సామాజికవర్గంతో పాటు సీనియర్‌ నేత కోణంలో లక్ష్మణ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ కీలక నేత ఒకరు చెబుతున్నారు. మార్పు చేయాలనుకుంటే మాత్రం డీకే అరుణ, జితేందర్‌ రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై స్పష్టత రావాలంటే.... డిసెంబర్‌ చివరికల్లా వేచి చూడాల్సిందే...!

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు


రాష్ట్రంలో కమల దళపతి ఎంపికపై పార్టీ శ్రేణుల నుంచి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కృష్ణదాస్‌ ఇప్పటికే అభిప్రాయాలు స్వీకరించారు. ఎక్కువ మంది రాష్ట్ర నేతలు ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్​ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రెండో దఫా అభిప్రాయ సేకరణలో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కమల దళపతి పీఠం దక్కేదెవ్వరికీ...?

దిల్లీ స్థాయిలో మంతనాలు....

మరోవైపు అధ్యక్ష పదవి కోసం దిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేరు ఒక దశలో గట్టిగా వినిపించినా... తొలిసారి ఎంపీగా గెలిచినందున పార్టీ రాష్ట్ర బాధ్యతల్ని చేపడితే.. నియోజకవర్గంలో పట్టు తగ్గిపోతుందని వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ఆశావాదుల వినతులు...

పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నేతలు సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్‌ ప్రభాకర్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తమకూ అవకాశం ఇవ్వాలని రఘునందన్‌రావు, కృష్ణసాగర్‌రావు పార్టీ ఇన్​ఛార్జి కృష్ణదాస్‌ను కలిసి కోరారు.

మరోసారి లక్ష్మణ్​కేనా...?

3 రోజుల క్రితం దిల్లీకి వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.... జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్ర అధ్యక్షునిగా మూడేళ్ల పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ టికెట్‌ ఆశించి దక్కని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిస్తోంది. బీసీ సామాజికవర్గం, పార్టీలో సీనియర్‌ నేత వంటి అంశాలు కలిసివస్తాయని... మరోసారి అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని లక్ష్మణ్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు.

డిసెంబర్​ చివరివరకు...

బీసీ సామాజికవర్గంతో పాటు సీనియర్‌ నేత కోణంలో లక్ష్మణ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ కీలక నేత ఒకరు చెబుతున్నారు. మార్పు చేయాలనుకుంటే మాత్రం డీకే అరుణ, జితేందర్‌ రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై స్పష్టత రావాలంటే.... డిసెంబర్‌ చివరికల్లా వేచి చూడాల్సిందే...!

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

Intro:Body:Conclusion:
Last Updated : Nov 28, 2019, 11:21 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.