ETV Bharat / state

'రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి' - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నందున హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలను కొవిడ్​ తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్​కు విజ్ఞప్తి చేశారు.

ఈటల రాజేందర్​ను కలిసిన శ్రీనివాస్​ గౌడ్​
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
author img

By

Published : Apr 23, 2021, 4:14 PM IST

కొవిడ్​ వ్యాక్సిన్​ను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు. బీఆర్కే భవన్​లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దోపిడి అరికట్టి వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్నారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. రెమిడెసివిర్ ఇంజక్షన్​ కొరత సృష్టిస్తున్న డ్రగ్​ మాఫియాపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

కొవిడ్​ వ్యాక్సిన్​ను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు. బీఆర్కే భవన్​లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దోపిడి అరికట్టి వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్నారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. రెమిడెసివిర్ ఇంజక్షన్​ కొరత సృష్టిస్తున్న డ్రగ్​ మాఫియాపై క్రిమినల్​ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.