ETV Bharat / state

తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం - DONATED BLOOD FOR TALASAMIA PATIENTS

సికింద్రాబాద్​లో టీం సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బాలానగర్ డీసీపీ పద్మజ హాజరయ్యారు.

blood donation for talasamia patients
తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం
author img

By

Published : May 2, 2020, 8:51 PM IST

సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఉన్న లక్ష్మీ కళా మందిర్ థియేటర్​లో టీమ్ సాయి ఆధ్వర్యంలో దాదాపు 120 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బాలానగర్ డీసీపీ పద్మజ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్, పోలీసు శాఖలతో సమన్వయమై టీం సాయి టాస్క్ ఫోర్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు.

కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో తల్లడిల్లుతున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. సిరిసిల్లలో రైతులు గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని దగ్ధం చేస్తుంటే కేటీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఉన్న లక్ష్మీ కళా మందిర్ థియేటర్​లో టీమ్ సాయి ఆధ్వర్యంలో దాదాపు 120 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బాలానగర్ డీసీపీ పద్మజ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్, పోలీసు శాఖలతో సమన్వయమై టీం సాయి టాస్క్ ఫోర్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు.

కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో తల్లడిల్లుతున్నారని తెలిపారు. అలాంటి వారికి అండగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. సిరిసిల్లలో రైతులు గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని దగ్ధం చేస్తుంటే కేటీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.