ETV Bharat / state

Teacher promotions Postpone Telangana : టీచర్లకు షాకింగ్ న్యూస్.. పదోన్నతులకు బ్రేక్​.. ఎందుకంటే!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 8:07 AM IST

Teacher promotions Postpone Telangana : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు ఇక ఆగిపోయినట్లే! పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌ తప్పనిసరి అని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం.. టెట్‌ ఉత్తీర్ణులై, పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్లుగా, గెజిటెడ్‌ హెచ్ఎంలుగా పదోన్నతులకు బ్రేక్‌ పడినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదోన్నతులపై ముందుకెళ్లడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.

SGT promotions Issue in Telangana
Teacher Transfers in Telangana
SGT promotions Issue ఉపాధ్యాయ పదోన్నతులకి బ్రేక్​

Teacher promotions Postpone Telangana : ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి( National Council of Teacher Education) ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో టెట్‌ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Teacher promotions Postpone : ఇప్పటికే మల్టీ జోన్‌-1తో పాటు మల్టీ జోన్‌-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్​జీటీలకు, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అది ఇక జరగకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పదోన్నతుల ప్రక్రియ(Teacher Promotion Telangana) ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

Telangana Teacher Transfers 2023 : సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల

Central Government order on Teacher Promotion : టెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఈ క్రమంలో టెట్‌ పాసై ఉపాధ్యాయ విధుల్లో చేరినవారి సంఖ్య రాష్ట్రంలో 15 వేల మందికి ఎక్కువగా ఉండరు. కాగా అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్‌ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్‌ అసిస్టెంట్లు అయ్యేవారు.

రాష్ట్రంలో నేటి నుంచే.. టీచర్ల బదిలీలు, పదోన్నతులు

పదోన్నతికీ టెట్‌ తప్పనిసరి( TET mandatory for promotion) కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని తొలుత కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అనంతరం ఈ గడువును 2019 వరకు పెంచుతూ పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇంకోసారి గడువు పెంచాలన్నా.. పార్లమెంటు ఆమోదం చెయాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గడువు పొడిగించినా.. సీనియర్‌ ఉపాధ్యాయులకు టెట్‌ పాస్‌ కావడం కష్టమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

Telangana TET Results 2023 : తెలంగాణ టెట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

SGT promotions Issue ఉపాధ్యాయ పదోన్నతులకి బ్రేక్​

Teacher promotions Postpone Telangana : ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి( National Council of Teacher Education) ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో టెట్‌ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Teacher promotions Postpone : ఇప్పటికే మల్టీ జోన్‌-1తో పాటు మల్టీ జోన్‌-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్​జీటీలకు, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అది ఇక జరగకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పదోన్నతుల ప్రక్రియ(Teacher Promotion Telangana) ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

Telangana Teacher Transfers 2023 : సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల

Central Government order on Teacher Promotion : టెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఈ క్రమంలో టెట్‌ పాసై ఉపాధ్యాయ విధుల్లో చేరినవారి సంఖ్య రాష్ట్రంలో 15 వేల మందికి ఎక్కువగా ఉండరు. కాగా అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్‌ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్‌ అసిస్టెంట్లు అయ్యేవారు.

రాష్ట్రంలో నేటి నుంచే.. టీచర్ల బదిలీలు, పదోన్నతులు

పదోన్నతికీ టెట్‌ తప్పనిసరి( TET mandatory for promotion) కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని తొలుత కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అనంతరం ఈ గడువును 2019 వరకు పెంచుతూ పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇంకోసారి గడువు పెంచాలన్నా.. పార్లమెంటు ఆమోదం చెయాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గడువు పొడిగించినా.. సీనియర్‌ ఉపాధ్యాయులకు టెట్‌ పాస్‌ కావడం కష్టమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

Telangana TET Results 2023 : తెలంగాణ టెట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.