ETV Bharat / state

కందుకూరు ఘటన.. మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23లక్షల ఆర్థిక సాయం..

author img

By

Published : Dec 29, 2022, 3:19 PM IST

Kandukur Incident: ఏపీలోని కందుకూరు ఘటనలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.23లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మొదట రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించినా.. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు.

Chandrababu
Chandrababu

Kandukur Incident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 23 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు .. ఒక్కో కుటుంబానికి పార్టీపరంగా రూ.15 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో మరికొందరు నేతలు తమ వంతుగా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.

వీరిలో కంచర్ల సుధాకర్‌ రూ.2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్‌ లక్ష రూపాయలు, ఇంటూరి నాగేశ్వరరావు లక్ష రూపాయలు, ఇంటూరి రాజేశ్‌ లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పార్టీ ఇచ్చే రూ.15 లక్షలతో పాటు.. టీడీపీ నేతలు ప్రకటించిన ఆర్థిక సాయంతో.. ఒక్కో కుటుంబానికి రూ.23 లక్షలు అందజేయనున్నారు.

Kandukur Incident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 23 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు .. ఒక్కో కుటుంబానికి పార్టీపరంగా రూ.15 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో మరికొందరు నేతలు తమ వంతుగా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.

వీరిలో కంచర్ల సుధాకర్‌ రూ.2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్‌ లక్ష రూపాయలు, ఇంటూరి నాగేశ్వరరావు లక్ష రూపాయలు, ఇంటూరి రాజేశ్‌ లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పార్టీ ఇచ్చే రూ.15 లక్షలతో పాటు.. టీడీపీ నేతలు ప్రకటించిన ఆర్థిక సాయంతో.. ఒక్కో కుటుంబానికి రూ.23 లక్షలు అందజేయనున్నారు.

ఇవీ చదవండి: చంద్రబాబు సభలో విషాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

మెరుగుపడిన ప్రధాన మంత్రి తల్లి ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.