ETV Bharat / state

కొండ చిలువను పట్టుకున్న గవర్నర్​ తమిళిసై

author img

By

Published : Apr 4, 2021, 11:39 PM IST

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కొండ చిలువను పట్టుకున్నారు. ఆ ఫొటోను ఆమె ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

Tamilisai Soundararajan
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్​గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్​ ట్వీట్​ చేశారు.

కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​​ చేశారు. అర్బన్​ ఫారెస్ట్​ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.

Tamilisai Soundararajan
అడవిలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్

ఇదీ చదవండి: మంత్రి ఈటలకు గవర్నర్​ తమిళిసై ఫోన్​

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్​గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్​ ట్వీట్​ చేశారు.

కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​​ చేశారు. అర్బన్​ ఫారెస్ట్​ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.

Tamilisai Soundararajan
అడవిలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్

ఇదీ చదవండి: మంత్రి ఈటలకు గవర్నర్​ తమిళిసై ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.