ETV Bharat / state

నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేసిన సువర్ణ ఫౌండేషన్

author img

By

Published : Apr 3, 2020, 7:41 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో అభాగ్యులను ఆదుకోవడానికి తాము ఉన్నామని పలు సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో వైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమదైన శైలిలో అభాగ్యులను చేరదీసి అన్న ప్రసాదం అందిస్తున్నాయి. పోలీసులకు సైతం పంపిణీ చేస్తూ అవిశ్రామంగా కృషి చేస్తున్నారు.

అభాగ్యులకు చేయుతనిస్తోన్నసువర్ణ ఫౌండేషన్
అభాగ్యులకు చేయుతనిస్తోన్నసువర్ణ ఫౌండేషన్

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు, అభాగ్యులకు సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. చిన్నారులకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. చిక్కడ పల్లి, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, వీఎస్​టీ రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి.

రోజుకు సుమారు 500 నుంచి 1000 వరకు...

ప్రతి రోజు సుమారు 500 నుంచి 1000 మందికి అన్నం, నీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ రాజేష్ బెస్త వెల్లడించారు. వైద్యపరంగా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుండగా... వలస కార్మికులకు తమ వంతు సహాయంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మురికి వాడలు, కాలనీల్లో పర్యటిస్తూ దశలవారీగా పంపిణీ చేస్తున్నట్లు రాజేశ్ వివరించారు. లాక్​ డౌన్ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల కృషి మరువలేనిదని స్థానికులు ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ బెస్త, తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యులకు చేయుతనిస్తోన్నసువర్ణ ఫౌండేషన్

ఇవీ చూడండి : ఆర్థిక మాంద్యం భయాలు.. నష్టాల్లోనే మార్కెట్లు

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు, అభాగ్యులకు సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందిస్తున్నారు. చిన్నారులకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. చిక్కడ పల్లి, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్ లింగంపల్లి, వీఎస్​టీ రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి.

రోజుకు సుమారు 500 నుంచి 1000 వరకు...

ప్రతి రోజు సుమారు 500 నుంచి 1000 మందికి అన్నం, నీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ రాజేష్ బెస్త వెల్లడించారు. వైద్యపరంగా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుండగా... వలస కార్మికులకు తమ వంతు సహాయంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మురికి వాడలు, కాలనీల్లో పర్యటిస్తూ దశలవారీగా పంపిణీ చేస్తున్నట్లు రాజేశ్ వివరించారు. లాక్​ డౌన్ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల కృషి మరువలేనిదని స్థానికులు ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ బెస్త, తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యులకు చేయుతనిస్తోన్నసువర్ణ ఫౌండేషన్

ఇవీ చూడండి : ఆర్థిక మాంద్యం భయాలు.. నష్టాల్లోనే మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.