ETV Bharat / state

ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ

author img

By

Published : Jul 29, 2020, 7:14 AM IST

జీహెచ్‌ఎంసీ సహా తెలంగాణలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌టైం స్కీంను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం సెప్టెంబరు 15తో ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలు రూ.1,477 కోట్లు ఉండగా.. ఇందులో వడ్డీనే రూ.1,017 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ
ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ: పురపాలక శాఖ

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సహా రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌టైం స్కీంను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా, వడ్డీలో 10 శాతం మేర చెల్లిస్తే సరిపోతుంది. అప్పటివరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించేవారికే ఇది వర్తిస్తుంది.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం సెప్టెంబరు 15తో ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలు రూ.1,477 కోట్లు ఉండగా.. ఇందులో వడ్డీనే రూ.1,017 కోట్లు అని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సహా రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌టైం స్కీంను ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా, వడ్డీలో 10 శాతం మేర చెల్లిస్తే సరిపోతుంది. అప్పటివరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించేవారికే ఇది వర్తిస్తుంది.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం సెప్టెంబరు 15తో ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలు రూ.1,477 కోట్లు ఉండగా.. ఇందులో వడ్డీనే రూ.1,017 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.