ETV Bharat / state

ప్రజా మద్దతుతోనే కరోనా కట్టడి సాధ్యం: డీజీపీ

author img

By

Published : Mar 24, 2020, 5:02 PM IST

కొవిడ్​-19ను అరికట్టాలంటే లాక్​డౌన్​ ఒక్కటే సరైన మార్గమని డీజీపీ మహేందర్​ రెడ్డి వెల్లడించారు. ప్రజల మద్దతు లేకపోతే నిర్వహించలేమని.. సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుల నివాస ప్రాంత నుంచి 3 కి.మీ వరకే అనుమతి ఉందని స్పష్టం చేశారు.

ప్రజల మద్దతు లేకపోతే నిర్వహించలేం: డీజీపీ
ప్రజల మద్దతు లేకపోతే నిర్వహించలేం: డీజీపీ

కరోనా విస్తరిస్తున్నందున లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లేకపోతే లాక్‌డౌన్‌ నిర్వహించలేమన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. స్థానికుల నివాస ప్రాంతం నుంచి 3 కి.మీ వరకే అనుమతి ఉందని.. రాత్రి 7 దాటిన తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం మహేందర్​ రెడ్డి స్పష్టం చేశారు.

కరోనా విస్తరిస్తున్నందున లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లేకపోతే లాక్‌డౌన్‌ నిర్వహించలేమన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. స్థానికుల నివాస ప్రాంతం నుంచి 3 కి.మీ వరకే అనుమతి ఉందని.. రాత్రి 7 దాటిన తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం మహేందర్​ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.