విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్గా ప్రమాణం చేసిన శ్రీరంగారావు అన్నారు. లకడీకపూల్లోని ఫెడరేషన్ హౌస్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్థిక సభ్యుడుగా బండారు కృష్ణయ్య, సాంకేతిక సభ్యుడిగా మనోహర్రాజు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా హాజరయ్యారు. ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని శ్రీరంగారావు తెలిపారు.
ఇవీచూడండి: కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ