'గోవులను పూజిద్దాం- గోవులను రక్షించుకుందాం' అంటూ 108 గోశాలలో గో సేవలు చేస్తూ శ్రీ సాయి శాంతి ట్రస్టు అధ్యక్షురాలు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సాయి శాంతి సహాయ సమితి ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు అధ్యక్షురాలు ఎర్రం శాంతి తెలిపారు.
హైదరాబాద్ సైదాబాద్లోని భూలక్ష్మి మాత దేవాలయం ప్రాంగణంలోని గోశాలలో గోవులకు పూజలు నిర్వహించి వాటికి గడ్డి, పళ్లు, దానా పెట్టారు. గోవులను దైవంతో సమానంగా పూజించే మనమందరం వాటిని రక్షించడంలోను ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఇదీ చదవండి: అంజన్న రూపంలో గొర్రెపిల్ల... గ్రామస్థుల పూజలు