ETV Bharat / state

లాక్​డౌన్​లోనూ స్పైస్​ జెట్​ విస్తృత సేవలు - spice jet services lockdown

లాక్​డౌన్​ సమయంలోనూ స్పైస్ జెట్ విమాన సంస్థ చేదోడు వాదోడుగా నిలుస్తోంది. కార్గో విమానాలను నడిపిస్తూ కరోనా నివారణకు సంబంధించిన ఔషధాలను దేశంలోని పలు ప్రాంతాలకు ఆగమేఘాల మీద చేరవేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి నేటి వరకు 885 కార్గో విమానాలను నడిపించింది.

స్పైస్​ జెట్​
స్పైస్​ జెట్​
author img

By

Published : May 9, 2020, 9:58 PM IST

స్పైస్​ జెట్​ విమాన సంస్థ లాక్​డౌన్​ తరుణంలోనూ తన సేవలందిస్తోంది. లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి 885 కార్గో విమానాలను నడపడమే గాక... 6384 టన్నుల వస్తువులను గమ్యస్థానాలకు చేరవేసింది. మిగతా అన్ని విమాన సంస్థలు సరఫరా చేసిన సరుకుల కంటే స్పైస్ జెట్ రెట్టింపు సంఖ్యలో రవాణా చేసింది. శనివారం సైతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 18 టన్నుల అత్యవసర ఔషధాలను తీసుకెళ్లారు. అదే విధంగా 321 కార్గో విమానాలు విదేశాలకు సరుకు రవాణా చేశాయి.

రవాణాలో అంతరాయం తలెత్తకుండా... ప్రయాణికుల విమానాలను సైతం కార్గో కోసం ఉపయోగిస్తోంది. కరోనా కట్టడికి కోసం ఉపయోగిస్తున్న శానిటైజర్లు, ఫేస్ మాస్క్, రాపిడ్ టెస్క్ కిట్లు, థర్మోమీటర్లను స్పైస్ ఎక్స్​ప్రెస్ విమానాలతో వేగంగా రవాణా చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి సైతం స్పైస్ జెట్ దోహదపడుతోంది. మార్చి 29వ తేదీన ఇరాన్ నుంచి తీసుకొచ్చిన 136 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి జోధ్​పూర్ క్వారంటైన్ కేంద్రానికి స్పైస్ జెట్ విమానంలోనే తరలించారు.

స్పైస్​ జెట్​ విమాన సంస్థ లాక్​డౌన్​ తరుణంలోనూ తన సేవలందిస్తోంది. లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి 885 కార్గో విమానాలను నడపడమే గాక... 6384 టన్నుల వస్తువులను గమ్యస్థానాలకు చేరవేసింది. మిగతా అన్ని విమాన సంస్థలు సరఫరా చేసిన సరుకుల కంటే స్పైస్ జెట్ రెట్టింపు సంఖ్యలో రవాణా చేసింది. శనివారం సైతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 18 టన్నుల అత్యవసర ఔషధాలను తీసుకెళ్లారు. అదే విధంగా 321 కార్గో విమానాలు విదేశాలకు సరుకు రవాణా చేశాయి.

రవాణాలో అంతరాయం తలెత్తకుండా... ప్రయాణికుల విమానాలను సైతం కార్గో కోసం ఉపయోగిస్తోంది. కరోనా కట్టడికి కోసం ఉపయోగిస్తున్న శానిటైజర్లు, ఫేస్ మాస్క్, రాపిడ్ టెస్క్ కిట్లు, థర్మోమీటర్లను స్పైస్ ఎక్స్​ప్రెస్ విమానాలతో వేగంగా రవాణా చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి సైతం స్పైస్ జెట్ దోహదపడుతోంది. మార్చి 29వ తేదీన ఇరాన్ నుంచి తీసుకొచ్చిన 136 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి జోధ్​పూర్ క్వారంటైన్ కేంద్రానికి స్పైస్ జెట్ విమానంలోనే తరలించారు.

ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.