లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న అసంఘటిత కార్మికులను ఆదుకున్న దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఇప్పుడు సికింద్రాబాద్లోని ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లకు ఆపన్న హస్తం అందించింది. చిలకలగూడ రైల్వే ఆఫీస్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
ఓలా, ఊబర్ జాతీయ సంఘాల ప్రధాన కార్యదర్శి సలాఉద్దీన్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది డ్రైవర్లను గుర్తించి వారికి పదిరోజులకు సరిపడా సరుకులు అందించినట్లు రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు తెలిపారు.