సామాజిక మాధ్యమంలో పరిచయమైన సౌత్ ఆప్రికాకు చెందిన వ్యక్తి తన కంపెనీలో భాగస్వామిగా చేరాలంటూ హైదరాబాద్ వాసి కోరాడు. నమ్మి సరేననడంతో నిలువునా ముంచేశాడు. ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేసే టోలిచౌకికి చెందిన మహమ్మద్ షోయబ్ ఖాన్కు సౌత్ ఆఫ్రికాకు చెందిన పార్క్ గియాన్ ర్యాంగ్ సామాజిక మాధ్యమంలో పరిచయం అయ్యాడు. తాను ఇన్వెస్టర్ ఫర్ సౌత్ కొరియా సంస్థకు అధినేతగా ర్యాంగ్ పరిచయం చేసుకున్నాడు. తన వ్యాపారాన్ని భారత్లో విస్తరించాలనుందని... మంచి వ్యాపార భాగస్వామి కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు.
మంచి స్నేహితునివి నువ్వే కదా...
10 వేల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భాగస్వామిగా ఉండాలని షోయబ్లో ఆశలు రేకెత్తించాడు. "నువ్వు ఎలాగో నాకు మంచి స్నేహితుడివి కాబట్టి ఆ డబ్బు నీకే పంపిస్తా... అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా న్యాయవాది నీకు అర్ధమయ్యేలా చెబుతారు" అంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ర్యాంగ్ మాటలు నమ్మిన షోయబ్ ఈ న్యాయవాదికి ఫోన్ చేశాడు. అన్ని వివరాలు మాట్లాడుకున్నారు.
రూ.14 లక్షలకు టోకరా...
పది వేల మిలియన్ డాలర్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పంపించాల్సి ఉన్నందున... ఆర్బీఐకి కనీసం రూ.14 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఆ వ్యక్తి షోయబ్కు వివరించాడు. ఆన్లైన్లో ఆ మొత్తాన్ని షోయబ్ బదిలీ చేశారు. ఆ తర్వాత సదరు వ్యక్తుల ఫోన్లు ఆగిపోవటం వల్ల మోసపోయానని గ్రహించిన షోయబ్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.