ETV Bharat / state

పార్లమెంట్ ఎన్నికలు 2024 - తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీ సుముఖత, ఆ స్థానం నుంచే బరిలోకి!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 1:54 PM IST

Updated : Jan 5, 2024, 7:06 PM IST

Sonia Gandhi Telangana Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై ఆరా తీస్తున్న పార్టీ అధిష్ఠానం, గెలుపునకు అవకాశం ఉన్న చోట నుంచి సోనియాగాంధీ పోటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Sonia Gandhi
parliament elections 2024

Sonia Gandhi Telangana Lok Sabha Elections 2024 : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఆ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ(Sonia Gandhi)ని ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటూ రెండు మార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒకసారి, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాలను అధిష్ఠానానికి పంపింది. అంతేకాకుండా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని స్వయంగా విజ్ఞప్తి చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే తెలంగాణలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సోనియాగాంధీ పోటీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అందులో ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గం ఒకటి. ఇందులోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు శాసనసభ నియోజకవర్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక్కడ మధిర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. దీంతో అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేసినట్లయితే గెలుపు సునాయాసం అవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కావడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, ఎక్కువ ఓట్ల మెజారిటీతో సోనియాగాంధీ గెలుపునకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

Telangana Congress : రెండోది నల్గొండ పార్లమెంటు నియోజక వర్గం. ఇక్కడ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇక్కడ నల్గొండ అసెంబ్లీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌, మాజీ ఎంపీ, రహదారులు, భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ శాసనసభ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా బలమైన నాయకులు కావడం, మంత్రులుగా ఉండడంతో నల్గొండ నుంచి సోనియాగాంధీని బరిలోకి దించినట్లయితే విజయం సాదించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మహబూబ్‌ నగర్‌ లోక్‌సభ స్థానంలో ఏడు శాసనసభ నియోజక వర్గాలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేకాదు ఈ నియోజక వర్గం పరిధిలోని కొడంగల్‌ అసెంబ్లీ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా, మాజీ ఎంపీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌ రెడ్డి ఉండడంతో ఇక్కడ నుంచి సోనియాగాంధీని పోటీలో నిలిపినట్లయితే ఆమె గెలుపు మరింత సులువు అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ మూడు నియోజక వర్గాలు సోనియాగాంధీ పోటీ చేసేందుకు అనుకూలమైనవిగా రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Lok Sabha Elections 2024 : అయితే సోనియాగాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌పై 1,67,178 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటున్న తరుణంలో ఇండియా కూటమితో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో సులువుగా గెలిచేందుకు అవకాశం ఉన్న తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రాష్ట్ర నాయకత్వం రెండు సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసిన చరిత్ర కూడా ఉండడంతో దక్షినాది రాష్ట్రమైన తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు చెబుతున్న పార్టీ వర్గాలు ఏఐసీసీ ఈ మూడు నియోజక వర్గాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొంటున్నాయి.

ఎక్కడ నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంటుందో అంచనా వేసే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోనియాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఆ ప్రభావం రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలపై ఉంటుందని భావిస్తోంది. దీని వల్ల ఇక్కడ నుంచి ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశమై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ - సర్దుబాటుపై స్వయంగా సీఎం రేవంత్‌ ఫోకస్

Sonia Gandhi Telangana Lok Sabha Elections 2024 : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఆ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ(Sonia Gandhi)ని ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటూ రెండు మార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒకసారి, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాలను అధిష్ఠానానికి పంపింది. అంతేకాకుండా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని స్వయంగా విజ్ఞప్తి చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే తెలంగాణలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సోనియాగాంధీ పోటీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అందులో ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గం ఒకటి. ఇందులోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు శాసనసభ నియోజకవర్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక్కడ మధిర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. దీంతో అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేసినట్లయితే గెలుపు సునాయాసం అవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కావడంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, ఎక్కువ ఓట్ల మెజారిటీతో సోనియాగాంధీ గెలుపునకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

Telangana Congress : రెండోది నల్గొండ పార్లమెంటు నియోజక వర్గం. ఇక్కడ సూర్యాపేట మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇక్కడ నల్గొండ అసెంబ్లీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌, మాజీ ఎంపీ, రహదారులు, భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ శాసనసభ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా బలమైన నాయకులు కావడం, మంత్రులుగా ఉండడంతో నల్గొండ నుంచి సోనియాగాంధీని బరిలోకి దించినట్లయితే విజయం సాదించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మహబూబ్‌ నగర్‌ లోక్‌సభ స్థానంలో ఏడు శాసనసభ నియోజక వర్గాలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేకాదు ఈ నియోజక వర్గం పరిధిలోని కొడంగల్‌ అసెంబ్లీ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా, మాజీ ఎంపీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌ రెడ్డి ఉండడంతో ఇక్కడ నుంచి సోనియాగాంధీని పోటీలో నిలిపినట్లయితే ఆమె గెలుపు మరింత సులువు అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ మూడు నియోజక వర్గాలు సోనియాగాంధీ పోటీ చేసేందుకు అనుకూలమైనవిగా రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Lok Sabha Elections 2024 : అయితే సోనియాగాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌పై 1,67,178 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటున్న తరుణంలో ఇండియా కూటమితో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో సులువుగా గెలిచేందుకు అవకాశం ఉన్న తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రాష్ట్ర నాయకత్వం రెండు సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసిన చరిత్ర కూడా ఉండడంతో దక్షినాది రాష్ట్రమైన తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు చెబుతున్న పార్టీ వర్గాలు ఏఐసీసీ ఈ మూడు నియోజక వర్గాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొంటున్నాయి.

ఎక్కడ నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంటుందో అంచనా వేసే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోనియాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఆ ప్రభావం రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలపై ఉంటుందని భావిస్తోంది. దీని వల్ల ఇక్కడ నుంచి ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశమై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ - సర్దుబాటుపై స్వయంగా సీఎం రేవంత్‌ ఫోకస్

Last Updated : Jan 5, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.