ETV Bharat / state

షేక్​పేట ఆదిత్య ఎంప్రెస్ టవర్స్​లో ఉత్సాహంగా గో గ్రీన్ కార్యక్రమం - హైదరాబాద్ తాజా వార్తలు

Go Green event: వృక్షో రక్షతి రక్షితహః.. పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు మన ముందున్న ఏకైక మార్గం చెట్లను పెంచడమే. ఇదే సూత్రాన్ని ఆకలింపుచేసుకొని మొక్కల పెంపకంపై పలువురు పర్యావరణ ప్రేమికులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఆసక్తితోనే షేక్​పేటలోని ఆదిత్య ఎంప్రెస్ టవర్స్​ వాసులు గో గ్రీన్​ కార్యక్రమం నిర్వహించారు.

గో గ్రీన్​ కార్యక్రమం
గో గ్రీన్​ కార్యక్రమం
author img

By

Published : May 15, 2022, 8:04 PM IST

Go Green event: పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అందరి బాధ్యతగా మారింది. మొక్కలు పెంచాలి.. చెట్లను సంరక్షించుకోవాలి.. అనే నినాదం చాలామంది ప్రకృతి ప్రేమికులను ఈ యజ్ఞంలో భాగమయ్యేలా చేస్తుంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్​ షేక్​పేట ప్రాంతంలోని ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ వాసులు తమవంతు బాధ్యతగా మొక్కల పెంపకంపై మెలకువలు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

అపార్ట్​మెంట్ వాసుల కోసం ప్రకృతి ప్రేమికులు డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం.. మొక్కల పెంపకంలో ప్రీ వర్క్ షాప్​ నిర్వహించారు. బోన్సాయ్ మొక్కలను ఎలా సేకరించాలి.. ఎలా పెంచాలి అనే అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరికి మొక్కలపై అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకురాలు సంగీత తెలిపారు. వర్క్​షాప్​కు హాజరైన వారికి ఐ ఫర్​ యూ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈరోజు మనం గో గ్రీన్ ఆదిత్య అనే కార్యక్రమం చేపట్టాం. మన సనాతన ధర్మంలో భాగంగా చెట్లను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయని చెప్పారు. అందుకే ఐ ఫర్​ యూ సంస్థ ద్వారా చెట్లను పంపిణీ చేయడం జరిగింది. -హిమాన్షు చరణ్, ఐ ఫర్​ యూ సంస్థ ఎండీ

నాకు చాలా సంవత్సరాల నుంచి బొన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నాను. ఈరోజు బొన్సాయ్ మొక్కలను ఎలా రక్షించుకోవాలి. వాటికి అవలంబిచాల్సిన పద్ధతుల గురించి తెలియచేస్తాను. -డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం, ప్రకృతి ప్రేమికులు

గో గ్రీన్ ఆదిత్య కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.బొన్సాయ్ మొక్కల గురించి సయ్యద్ అబ్దుల్ హకీం తెలియచేస్తారు. అందులో భాగంగా బొన్సాయ్ మొక్కలను పంపిణీ చేస్తున్నాం. - సంగీత, నిర్వాహకురాలు

షేక్​పేట ఆదిత్య ఎంప్రెస్ టవర్స్​లో ఉత్సాహంగా గో గ్రీన్ కార్యక్రమం

ఇదీ చదవండి: 'అమిత్​ షా తన పేరును అబద్దాల బాద్​షా అని మార్చుకోవాలి'

'కాంగ్రెస్​కు ఉషోదయం.. అక్టోబర్ నుంచి 'భారత్ జోడో' యాత్ర'

Go Green event: పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అందరి బాధ్యతగా మారింది. మొక్కలు పెంచాలి.. చెట్లను సంరక్షించుకోవాలి.. అనే నినాదం చాలామంది ప్రకృతి ప్రేమికులను ఈ యజ్ఞంలో భాగమయ్యేలా చేస్తుంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్​ షేక్​పేట ప్రాంతంలోని ఆదిత్య ఎంప్రెస్ టవర్స్ వాసులు తమవంతు బాధ్యతగా మొక్కల పెంపకంపై మెలకువలు నేర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

అపార్ట్​మెంట్ వాసుల కోసం ప్రకృతి ప్రేమికులు డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం.. మొక్కల పెంపకంలో ప్రీ వర్క్ షాప్​ నిర్వహించారు. బోన్సాయ్ మొక్కలను ఎలా సేకరించాలి.. ఎలా పెంచాలి అనే అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరికి మొక్కలపై అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకురాలు సంగీత తెలిపారు. వర్క్​షాప్​కు హాజరైన వారికి ఐ ఫర్​ యూ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈరోజు మనం గో గ్రీన్ ఆదిత్య అనే కార్యక్రమం చేపట్టాం. మన సనాతన ధర్మంలో భాగంగా చెట్లను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయని చెప్పారు. అందుకే ఐ ఫర్​ యూ సంస్థ ద్వారా చెట్లను పంపిణీ చేయడం జరిగింది. -హిమాన్షు చరణ్, ఐ ఫర్​ యూ సంస్థ ఎండీ

నాకు చాలా సంవత్సరాల నుంచి బొన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నాను. ఈరోజు బొన్సాయ్ మొక్కలను ఎలా రక్షించుకోవాలి. వాటికి అవలంబిచాల్సిన పద్ధతుల గురించి తెలియచేస్తాను. -డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం, ప్రకృతి ప్రేమికులు

గో గ్రీన్ ఆదిత్య కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.బొన్సాయ్ మొక్కల గురించి సయ్యద్ అబ్దుల్ హకీం తెలియచేస్తారు. అందులో భాగంగా బొన్సాయ్ మొక్కలను పంపిణీ చేస్తున్నాం. - సంగీత, నిర్వాహకురాలు

షేక్​పేట ఆదిత్య ఎంప్రెస్ టవర్స్​లో ఉత్సాహంగా గో గ్రీన్ కార్యక్రమం

ఇదీ చదవండి: 'అమిత్​ షా తన పేరును అబద్దాల బాద్​షా అని మార్చుకోవాలి'

'కాంగ్రెస్​కు ఉషోదయం.. అక్టోబర్ నుంచి 'భారత్ జోడో' యాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.