ETV Bharat / sports

ముంబయి ఇండియన్స్​కు షాక్- రూ.4.8 కోట్ల ప్లేయర్ IPLకు ​ దూరం - MUMBAI INDIANS IPL 2025

ముంబయి ఇండియన్స్​కు ఎదురు దెబ్బ- ప్రారంభానికి ముందే యంగ్ ప్లేయర్ టోర్నీకి దూరం!

Ipl 2025 MI
Ipl 2025 MI (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 13, 2025, 7:07 AM IST

Mumbai Indians IPL 2025 : 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జరిగిన మెగావేలంలో రూ.4.80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు గాయంబారిన పడ్డాడు. దీంతో ఛాంపియన్స్​ ట్రోఫీతోపాటు రానున్న ఐపీఎల్​కు గానూ దూరం కానున్నాడు. దీంతో ముంబయి యాజమాన్యంతోపాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?

గత సీజన్​లో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు చేరలేకపోయిన ముంబయి, ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే జట్టును తయారు చేసుకుంది. ఇందులో భాగంగానే ఆఫ్గానిస్థాన్​కు చెందిన 18ఏళ్ల స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్‌ను మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. ఈ యంగ్‌ మిస్టరీ స్పిన్నర్‌పై ముంబయి భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే రీసెంట్​గా జరిగిన జింబాబ్వే పర్యటనలో గజన్​ఫర్ వెన్నుముకకు గాయమైంది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

జెట్ స్పీడ్​లో వచ్చినా!
దేశవాళీలో రాణించిన గజన్​ఫర్​కు తక్కువ సమయంలోనే అంతర్జాతీయ పిలుపు వచ్చింది. జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన గజన్​ఫర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సైతం స్థానం దక్కించుకున్నాడు. అలా జెట్​ స్పీడ్​లోనే ఐసీసీ టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఇంతలోనే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక గజన్​ఫర్ స్థానంలో నంగ్యాల్ కరోటిని అఫ్గాన్ ఎంపికచేసింది.

గతేడాది ఒమన్‌లో జరిగిన మెన్స్‌ ఎమర్జింగ్ ఆసియా కప్‌లోనూ గజన్‌ఫర్ ఆడాడు. ఈ టోర్నీ సెమీస్​లో భారత్- అఫ్గాన్​ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో గజన్​ఫర్ రెండు వికెట్లతో రాణించాడు. అతడు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్​ను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు బంగ్లాదేశ్​తో వన్డే సిరీస్​ తొలి మ్యాచ్​లో రఫ్పాడించాడు. 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతడి దెబ్బకు బంగ్లా 143 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఐపీఎల్​లోనూ రాణింస్తాడని ముంబయి భావించింది. కానీ, తాజా అతడు టోర్నీకి దురం అవ్వడంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

క్రికెట్‌ వదిలేసి కెనడాకు! - కట్‌ చేస్తే ముంబయి రూ.5.25 కోట్లకు కొనేసింది!

ఫైనల్​లో SRHకు షాక్- మళ్లీ రన్నరప్​గానే- పాపం కావ్య ఫీలైందిగా!

Mumbai Indians IPL 2025 : 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జరిగిన మెగావేలంలో రూ.4.80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు గాయంబారిన పడ్డాడు. దీంతో ఛాంపియన్స్​ ట్రోఫీతోపాటు రానున్న ఐపీఎల్​కు గానూ దూరం కానున్నాడు. దీంతో ముంబయి యాజమాన్యంతోపాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?

గత సీజన్​లో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు చేరలేకపోయిన ముంబయి, ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే జట్టును తయారు చేసుకుంది. ఇందులో భాగంగానే ఆఫ్గానిస్థాన్​కు చెందిన 18ఏళ్ల స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్‌ను మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. ఈ యంగ్‌ మిస్టరీ స్పిన్నర్‌పై ముంబయి భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే రీసెంట్​గా జరిగిన జింబాబ్వే పర్యటనలో గజన్​ఫర్ వెన్నుముకకు గాయమైంది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

జెట్ స్పీడ్​లో వచ్చినా!
దేశవాళీలో రాణించిన గజన్​ఫర్​కు తక్కువ సమయంలోనే అంతర్జాతీయ పిలుపు వచ్చింది. జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన గజన్​ఫర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సైతం స్థానం దక్కించుకున్నాడు. అలా జెట్​ స్పీడ్​లోనే ఐసీసీ టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఇంతలోనే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక గజన్​ఫర్ స్థానంలో నంగ్యాల్ కరోటిని అఫ్గాన్ ఎంపికచేసింది.

గతేడాది ఒమన్‌లో జరిగిన మెన్స్‌ ఎమర్జింగ్ ఆసియా కప్‌లోనూ గజన్‌ఫర్ ఆడాడు. ఈ టోర్నీ సెమీస్​లో భారత్- అఫ్గాన్​ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో గజన్​ఫర్ రెండు వికెట్లతో రాణించాడు. అతడు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్​ను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు బంగ్లాదేశ్​తో వన్డే సిరీస్​ తొలి మ్యాచ్​లో రఫ్పాడించాడు. 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతడి దెబ్బకు బంగ్లా 143 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఐపీఎల్​లోనూ రాణింస్తాడని ముంబయి భావించింది. కానీ, తాజా అతడు టోర్నీకి దురం అవ్వడంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

క్రికెట్‌ వదిలేసి కెనడాకు! - కట్‌ చేస్తే ముంబయి రూ.5.25 కోట్లకు కొనేసింది!

ఫైనల్​లో SRHకు షాక్- మళ్లీ రన్నరప్​గానే- పాపం కావ్య ఫీలైందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.