ETV Bharat / state

వైరస్ కట్టడి కోసమే కరోనా పరీక్ష కేంద్రం తరలింపు

author img

By

Published : May 11, 2021, 5:25 PM IST

హైదరాబాద్ షాద్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా పరీక్ష కేంద్రాన్ని వేరే చోటుకు మార్చారు. వ్యాక్సిన్, పరీక్ష కేంద్రాలు ఒకేచోట ఉండటం వల్ల ఆరోగ్యవంతులకు వైరస్ సోకే ప్రమాదమున్నందునే మార్చినట్లు వెల్లడించారు.

corona test center evacuation
కరోనా పరీక్ష కేంద్రం తరలింపు

హైదరాబాద్ షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ల కోసం వస్తున్న వారితో కిక్కిరిసిపోయింది. విషయం గుర్తించిన ఆధికారులు కరోనా పరీక్షలు చేసే కేంద్రాన్ని ఆస్పత్రి ఎదుట గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోకి తరలించారు.

కరోనా పరీక్షలు వస్తున్న వారి నుంచి వ్యాక్సిన్ కోసం వస్తున్న ప్రజలకు వైరక్ సోకకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేసినట్లు షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంస్థ అయిన షాద్​నగర్ సేవా భారతి సంస్థ సభ్యులు కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం వస్తున్న వారికి తాగునీరు అందించారు.

హైదరాబాద్ షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ల కోసం వస్తున్న వారితో కిక్కిరిసిపోయింది. విషయం గుర్తించిన ఆధికారులు కరోనా పరీక్షలు చేసే కేంద్రాన్ని ఆస్పత్రి ఎదుట గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోకి తరలించారు.

కరోనా పరీక్షలు వస్తున్న వారి నుంచి వ్యాక్సిన్ కోసం వస్తున్న ప్రజలకు వైరక్ సోకకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేసినట్లు షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంస్థ అయిన షాద్​నగర్ సేవా భారతి సంస్థ సభ్యులు కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం వస్తున్న వారికి తాగునీరు అందించారు.

ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.