ETV Bharat / state

ఓయూలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు​ - ఎన్టీఆర్ జయంతి వేడుకలు​

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్​ అని తలారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేదలకు 2 రూపాలయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం విధించిన మహానేత అని గుర్తు చేశారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 28, 2020, 8:32 PM IST

తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలను ఓయూలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్​ అధ్యక్షుడు,ఓయూ పరిశోధన విద్యార్థి తలారి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బ్రేడ్​ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

నటుడుగా, ముఖ్యమంత్రిగా రెండు రంగాల్లో విజయం సాధించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్రీనివాస రావు పేర్కొన్నారు. నిత్యము పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మహానియుడని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్​కు" భారతరత్న" ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్​తోపాటు తార్నాక, అడ్డగుట్ట తెతెదేపా నేతలు పాల్గొన్నారు.

తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలను ఓయూలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్​ అధ్యక్షుడు,ఓయూ పరిశోధన విద్యార్థి తలారి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బ్రేడ్​ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

నటుడుగా, ముఖ్యమంత్రిగా రెండు రంగాల్లో విజయం సాధించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్రీనివాస రావు పేర్కొన్నారు. నిత్యము పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మహానియుడని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్​కు" భారతరత్న" ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్​తోపాటు తార్నాక, అడ్డగుట్ట తెతెదేపా నేతలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.