ETV Bharat / state

సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

author img

By

Published : Jun 19, 2020, 11:25 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్​ హైదరాబాద్​లో కన్నుమూశారు. విఠల్​ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

senior ias bp vital passed away in hyderabad
సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

సీనియర్​ ఐఏఎస్​ అధికారి, ఆర్థికవేత్త బీపీ విఠల్​ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఉన్నప్పుడు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఐఎంఎఫ్​కు సలహాదారుగా, పదో ఆర్థిక సంఘం సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. విఠల్​ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సర్​ప్లస్​ అనే పుస్తకాన్ని రాసిన విఠల్​... రాష్ట్ర స్థిరత్వంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారంటూ మంత్రి కేటీఆర్​ గుర్తు చేసుకున్నారు. బీపీ విఠల్​ కుమారుడు సంజయ్​ బారు ప్రధాని మీడియా సలహాదారునిగా పనిచేశారు. విఠల్​ మృతి పట్ల రాష్ట్ర ఐఏఎస్​ అధికారుల సంఘ అధ్యక్షుడు బీపీ ఆచార్య సంతాపం తెలిపారు. గొప్ప అధికారిని కోల్పోయామని ఆచార్య అన్నారు.

సీనియర్​ ఐఏఎస్​ అధికారి, ఆర్థికవేత్త బీపీ విఠల్​ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఉన్నప్పుడు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఐఎంఎఫ్​కు సలహాదారుగా, పదో ఆర్థిక సంఘం సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. విఠల్​ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సర్​ప్లస్​ అనే పుస్తకాన్ని రాసిన విఠల్​... రాష్ట్ర స్థిరత్వంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారంటూ మంత్రి కేటీఆర్​ గుర్తు చేసుకున్నారు. బీపీ విఠల్​ కుమారుడు సంజయ్​ బారు ప్రధాని మీడియా సలహాదారునిగా పనిచేశారు. విఠల్​ మృతి పట్ల రాష్ట్ర ఐఏఎస్​ అధికారుల సంఘ అధ్యక్షుడు బీపీ ఆచార్య సంతాపం తెలిపారు. గొప్ప అధికారిని కోల్పోయామని ఆచార్య అన్నారు.

ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.