ETV Bharat / state

'కంటోన్మెంట్​లోనూ బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేయాలి' - బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్​ విధానం అమలుపై ప్రెస్​మీట్

బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని కంటోన్మెంట్​లో కూడా వర్తింపజేయాలని.. దాని వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే ఎంపీ బండి సంజయ్​కుమార్​కు వినతిపత్రాన్ని అందజేశామన్నారు.

secunderabad CANTONMENT  EX VP FIRE ON BOARD MEMBERS
'కంటోన్మెంట్​లోనూ బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేయాలి'
author img

By

Published : Sep 12, 2020, 5:14 PM IST

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని కంటోన్మెంట్​లో కూడా వర్తింపజేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. ఇక్కడి ప్రజలకు బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలుచేయడం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని గ్రేటర్​ ప్రాంతానికి వరంగా మారిన ఎల్ఆర్ఎస్ విధానం కంటోన్మెంట్ ప్రాంతానికి శాపంగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు మల్లికార్జున్ తెలిపారు.

కంటోన్మెంట్​ ప్రాంతంలో వర్షాకాలంలోనూ నీటి సమస్య తలెత్తడం పట్ల బోర్డు సభ్యులు మాట్లాడే విధానం సరికాదని.. దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని మల్లికార్జున్ సవాల్​ విసిరారు. కంటోన్మెంట్​కు రావాల్సిన నిధులు, పాత బకాయిలను తీసుకురావడంలో కూడా బోర్డు సభ్యులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పదవుల్లో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని కంటోన్మెంట్​లో కూడా వర్తింపజేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. ఇక్కడి ప్రజలకు బీఆర్​ఎస్, ఎల్ఆర్ఎస్ విధానాన్ని అమలుచేయడం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని గ్రేటర్​ ప్రాంతానికి వరంగా మారిన ఎల్ఆర్ఎస్ విధానం కంటోన్మెంట్ ప్రాంతానికి శాపంగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు మల్లికార్జున్ తెలిపారు.

కంటోన్మెంట్​ ప్రాంతంలో వర్షాకాలంలోనూ నీటి సమస్య తలెత్తడం పట్ల బోర్డు సభ్యులు మాట్లాడే విధానం సరికాదని.. దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని మల్లికార్జున్ సవాల్​ విసిరారు. కంటోన్మెంట్​కు రావాల్సిన నిధులు, పాత బకాయిలను తీసుకురావడంలో కూడా బోర్డు సభ్యులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పదవుల్లో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.