ETV Bharat / state

Tribal Development: 'మా తండాలో మా రాజ్యం'.. కేసీఆర్ నిర్ణయంతో ఎస్టీల జీవితాల్లో వెలుగు - stsdf

Tribal Development In Telangana : రాష్ట్రంలో ఎస్టీల రాజకీయ సాధికారత దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు సీఎం కేసీఆర్‌ కార్యరూపమిచ్చారు. గిరిజనుల ఎన్నో ఏళ్ల కలలను సాకారం చేస్తూ తండాలకు స్వయంపాలనా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం సామాజిక అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లైంది. 500 జనాభాను మించి వున్న 2 వేల 471 తండాలు, గూడేలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం, ఎస్టీల జీవితాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది.

Tribal welfare
Tribal welfare
author img

By

Published : Apr 22, 2023, 2:23 PM IST

Updated : Apr 22, 2023, 2:38 PM IST

'మా తండాలో మా రాజ్యం'.. కేసీఆర్ నిర్ణయంతో ఎస్టీల జీవితాల్లో వెలుగు

Tribal Development In Telangana : రాష్ట్రంలో మొత్తం 3,146 తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజనుల హర్షధ్వానాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులు, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి రాజకీయ అధికారంలో భాగస్వాములై రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కేవలం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వేయడంతోనే, రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోలేదు.

Telangana Tribal Development : ప్రతీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన సంక్షేమశాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 1,287 తండాలకు, గూడేలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 1,385 కోట్లు మంజూరు చేసింది. బీటీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి.

ఎస్టీఎస్డీఎఫ్ కింద రాష్ట్రంలోని ఎస్టీ ఆవాసాల 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 88 బీటీ రోడ్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో భాగంగా 211.86 కిలోమీటర్ల పొడవునా బీటీ రోడ్లను వేసేందుకు 156.60 కోట్ల రూపాయల అంచనాతో 88 పనులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమంతించబడిన బీటీ రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఎస్డీఎఫ్ చట్టం 2017 ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించే నిధులకు ఉద్దేశించిన నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ 2017ను ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎస్డీఎఫ్ కింద ఇప్పటివరకు ఎస్టీల సంక్షేమానికి 47 వేల 282 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం మంజూరైన బీటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది.

గిరిజనుల సంతోషానికి అవధుల్లేవ్ : స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్ల పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎస్టీల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఏన్కూరు మండలం బురధరాఘవాపురం వరకు 9.75 కోట్ల రూపాయల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు చేపట్టేందుకు స్థానిక సర్పంచ్‌ల సమక్షంలో పంచాయతీ రాజ్ విభాగం అధికారులు సర్వే చేశారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనెక్టివిటీ లేని ఎస్టీ ఆవాసాలకు కనెక్టివిటీలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల అందుబాటుతో రవాణా సులభం: ఈ బీటీ రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగై విద్యా, వైద్య, నిత్యావసర వస్తువులు తదితర అనేక సౌలభ్యాలు కలిగి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలుపడుతుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దశాబ్ధాలుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వేలాది తండాలు, గూడేలు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలతో స్వయంపాలన.. సాధికారతలతో వెలుగులోకి రావడం సాధ్యమైంది. బీటీ రోడ్ల నిర్మాణంతో గిరిజనుల జీవితాల్లో బంగారు బాటలు వేసిన ఘనత. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే.

మారుమూల వాగులు వంకలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాలు ప్రజలకు ఈ బీటీ రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం కలగనుంది. ఎస్డీఎఫ్ నిధులతో ఆదివాసీ గిరిజనుల దీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతున్నది.

ఇవీ చదవండి:

'మా తండాలో మా రాజ్యం'.. కేసీఆర్ నిర్ణయంతో ఎస్టీల జీవితాల్లో వెలుగు

Tribal Development In Telangana : రాష్ట్రంలో మొత్తం 3,146 తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజనుల హర్షధ్వానాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులు, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి రాజకీయ అధికారంలో భాగస్వాములై రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కేవలం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వేయడంతోనే, రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోలేదు.

Telangana Tribal Development : ప్రతీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన సంక్షేమశాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 1,287 తండాలకు, గూడేలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 1,385 కోట్లు మంజూరు చేసింది. బీటీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి.

ఎస్టీఎస్డీఎఫ్ కింద రాష్ట్రంలోని ఎస్టీ ఆవాసాల 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 88 బీటీ రోడ్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో భాగంగా 211.86 కిలోమీటర్ల పొడవునా బీటీ రోడ్లను వేసేందుకు 156.60 కోట్ల రూపాయల అంచనాతో 88 పనులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమంతించబడిన బీటీ రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఎస్డీఎఫ్ చట్టం 2017 ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించే నిధులకు ఉద్దేశించిన నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ 2017ను ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎస్డీఎఫ్ కింద ఇప్పటివరకు ఎస్టీల సంక్షేమానికి 47 వేల 282 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం మంజూరైన బీటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది.

గిరిజనుల సంతోషానికి అవధుల్లేవ్ : స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్ల పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎస్టీల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఏన్కూరు మండలం బురధరాఘవాపురం వరకు 9.75 కోట్ల రూపాయల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు చేపట్టేందుకు స్థానిక సర్పంచ్‌ల సమక్షంలో పంచాయతీ రాజ్ విభాగం అధికారులు సర్వే చేశారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనెక్టివిటీ లేని ఎస్టీ ఆవాసాలకు కనెక్టివిటీలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల అందుబాటుతో రవాణా సులభం: ఈ బీటీ రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగై విద్యా, వైద్య, నిత్యావసర వస్తువులు తదితర అనేక సౌలభ్యాలు కలిగి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలుపడుతుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దశాబ్ధాలుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వేలాది తండాలు, గూడేలు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలతో స్వయంపాలన.. సాధికారతలతో వెలుగులోకి రావడం సాధ్యమైంది. బీటీ రోడ్ల నిర్మాణంతో గిరిజనుల జీవితాల్లో బంగారు బాటలు వేసిన ఘనత. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే.

మారుమూల వాగులు వంకలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాలు ప్రజలకు ఈ బీటీ రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం కలగనుంది. ఎస్డీఎఫ్ నిధులతో ఆదివాసీ గిరిజనుల దీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతున్నది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 22, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.