ETV Bharat / state

RTC: మహిళల భద్రతకు పెద్దపీట.. ఆ సమయం దాటితే ఆపాల్సిందే - మహిళల కోసం ప్రత్యేకం

మహిళల భద్రత కోసం ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలోని మహిళలకు ప్రత్యేక సదుపాయం కల్పించింది. రాత్రివేళల్లో వారు చేయి ఎత్తిన చోట బస్సులు ఆపాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి డ్రైవర్లు, కండక్టర్లలందరికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

RTC
RTC
author img

By

Published : Jul 7, 2021, 10:32 PM IST

'ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం' అని ప్రతి బస్సు వెనకాల రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రజా రవాణా వ్యవస్థ పని చేస్తోంది కూడా. అదేవిధంగా మహిళల భద్రత విషయంలో మరో అడుగు ముందుకేసింది. రాత్రి సమయంలో ఎక్కైడైనా బస్సులు ఆపేలా వారికి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వారి భద్రత దృష్ట్యా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. రాజధాని నగరంలో ఉద్యోగరీత్యా కార్యాలయాలకు వెళ్లి వచ్చే మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రేటర్​ పరిధిలో ఎక్కడా చేయి ఎత్తినా అక్కడ బస్సు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అదేవిధంగా వారు కోరిన చోట బస్సు దిగేలా సదుపాయాన్ని కల్పించారు. రాత్రి సమయంలో 7.30 తర్వాత మహిళల కోసం నగరంలో ఎక్కడైనా బస్సు ఆపాల్సిందేనని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

భద్రతకు పెద్దపీట

నగరంలో ఇప్పటి వరకు కేవలం బస్సు స్టాపుల్లో మాత్రమే బస్సును ఆపాలన్న నిబంధన ఉండేది. గ్రేటర్ పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లలందరికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. బస్సులు ఆపే విషయంలో మహిళలు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే సంబంధిత డిపో మేనేజర్​కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. విచారణ అనంతరం సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటారని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సౌకర్యం పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 99592 26154 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:

TSRTC: ‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...!

'ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం' అని ప్రతి బస్సు వెనకాల రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రజా రవాణా వ్యవస్థ పని చేస్తోంది కూడా. అదేవిధంగా మహిళల భద్రత విషయంలో మరో అడుగు ముందుకేసింది. రాత్రి సమయంలో ఎక్కైడైనా బస్సులు ఆపేలా వారికి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వారి భద్రత దృష్ట్యా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. రాజధాని నగరంలో ఉద్యోగరీత్యా కార్యాలయాలకు వెళ్లి వచ్చే మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రేటర్​ పరిధిలో ఎక్కడా చేయి ఎత్తినా అక్కడ బస్సు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అదేవిధంగా వారు కోరిన చోట బస్సు దిగేలా సదుపాయాన్ని కల్పించారు. రాత్రి సమయంలో 7.30 తర్వాత మహిళల కోసం నగరంలో ఎక్కడైనా బస్సు ఆపాల్సిందేనని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

భద్రతకు పెద్దపీట

నగరంలో ఇప్పటి వరకు కేవలం బస్సు స్టాపుల్లో మాత్రమే బస్సును ఆపాలన్న నిబంధన ఉండేది. గ్రేటర్ పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లలందరికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. బస్సులు ఆపే విషయంలో మహిళలు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే సంబంధిత డిపో మేనేజర్​కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. విచారణ అనంతరం సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటారని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సౌకర్యం పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 99592 26154 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:

TSRTC: ‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.