తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ సిరిపురం ప్రాంతంలో సాయి శ్రీనివాస్రెడ్డి కాంప్లెక్స్లో 104వ ప్లాట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల నెల్లూరులో శుభకార్యానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదే అదునుగా భావించి దార్ల చందు, రాకేష్, వినోద్ కుమార్ అనే వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, సామగ్రి, నగదు, చరవాణిలను అపహరించారు. అదే అపార్ట్మెంట్లోని మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం చేశారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వీరిని మల్కాజిగిరి ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'