ETV Bharat / state

చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..

చలికాలం అంటేనే వణుకుపుడుతోంది. ఇంట్లోనే రెండు, మూడు దుప్పట్లు కప్పుకుంటే గానీ చలి ఆగదు. అటువంటింది రాత్రివేళ రోడ్ల పక్కన నిద్రించడమంటే మాములు విషయం కాదు. వందలాది అభాగ్యులు చలికి వణుకుతూ పాదచారులు వెళ్లే దారిలో నిద్రిస్తున్నారు. చలికి తట్టుకోలేక రోడ్డుమీద దొరికే ప్లాస్టిక్​ కవర్లనే కొందరు దుప్పట్లుగా కప్పుకుంటున్నారు. మరికొందరు శునకాలతో సావాసం చేస్తున్నారు. హైదరాబాద్​లో కన్పించిన ఇలాంటి దృశ్యాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

author img

By

Published : Dec 27, 2019, 3:26 PM IST

చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..
చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..
చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..
చలికాలంలో ఇంట్లో ఉన్నవాళ్లే దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు. అలాంటిది భిక్షాటన చేసేవారు.. అనాథలు, అభాగ్యులు మాత్రం పుట్ పాత్​ల పైనే నిద్రిస్తుంటారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఆశ్రమం కల్పించినా.. ఇంకా చాలాప్రాంతాల్లో ఇటువంటి వారు చలికి వణుకుతూనే ఉన్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని మహాంకాళి దేవాలయం, పారడైజ్ హోటల్ వీధి, గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటివారు కన్పిస్తారు.

అయితే హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ షాహిద్ పేదలకు సాయం చేయాలని పరితపించాడు. చిన్న కిరాణ కొట్టు నడిపిస్తూ జీవితం సాగిస్తున్నా.. మొహమ్మద్​ ఉన్న దాంట్లో సాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి రోడ్ల పక్కన పడుకున్న అభాగ్యులకు దుప్పట్లు కప్పి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.

రాత్రి వేళల్లో పోలీసులు కూడా సరిగ్గా పడుకోనివ్వడంలేదని రోడ్ల పక్కన పడుకున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఇళ్లు లేవని.. కనీసం రోడ్డు పక్కన పడుకుందామంటే.. ఎప్పుడు ఎవరొచ్చి వెళ్లగొడతారో అని భయంభయంగా ఉంటుందన్నారు. ఒక్కోసారి వాహనాలు వేగంగా వచ్చి మీదకు దూసుకొచ్చిన ఘటనలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అలా చనిపోయినా.. పట్టించుకునే వారు ఉండరన్నారు. చనిపోయిన వారికోసం ఎవ్వరూ రాకపోవడం వల్ల వారిని అలాగే తీసుకెళతారని పేర్కొన్నారు.

రోడ్లపక్క జీవితం.. గాలిలో దీపం లాంటిదని బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు బతుకుతామో తెలియదని.. జీవించినంత కాలం.. ఇలా రోడ్లమీదనే ఉంటామంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని రాత్రి వేళ పడుకునేందుకు ఆశ్రమం కల్పించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'

చలిలో రోడ్ల పక్కే నివాసం.. శునకాలతో సావాసం..
చలికాలంలో ఇంట్లో ఉన్నవాళ్లే దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు. అలాంటిది భిక్షాటన చేసేవారు.. అనాథలు, అభాగ్యులు మాత్రం పుట్ పాత్​ల పైనే నిద్రిస్తుంటారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఆశ్రమం కల్పించినా.. ఇంకా చాలాప్రాంతాల్లో ఇటువంటి వారు చలికి వణుకుతూనే ఉన్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని మహాంకాళి దేవాలయం, పారడైజ్ హోటల్ వీధి, గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటివారు కన్పిస్తారు.

అయితే హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ షాహిద్ పేదలకు సాయం చేయాలని పరితపించాడు. చిన్న కిరాణ కొట్టు నడిపిస్తూ జీవితం సాగిస్తున్నా.. మొహమ్మద్​ ఉన్న దాంట్లో సాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి రోడ్ల పక్కన పడుకున్న అభాగ్యులకు దుప్పట్లు కప్పి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.

రాత్రి వేళల్లో పోలీసులు కూడా సరిగ్గా పడుకోనివ్వడంలేదని రోడ్ల పక్కన పడుకున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఇళ్లు లేవని.. కనీసం రోడ్డు పక్కన పడుకుందామంటే.. ఎప్పుడు ఎవరొచ్చి వెళ్లగొడతారో అని భయంభయంగా ఉంటుందన్నారు. ఒక్కోసారి వాహనాలు వేగంగా వచ్చి మీదకు దూసుకొచ్చిన ఘటనలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అలా చనిపోయినా.. పట్టించుకునే వారు ఉండరన్నారు. చనిపోయిన వారికోసం ఎవ్వరూ రాకపోవడం వల్ల వారిని అలాగే తీసుకెళతారని పేర్కొన్నారు.

రోడ్లపక్క జీవితం.. గాలిలో దీపం లాంటిదని బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు బతుకుతామో తెలియదని.. జీవించినంత కాలం.. ఇలా రోడ్లమీదనే ఉంటామంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని రాత్రి వేళ పడుకునేందుకు ఆశ్రమం కల్పించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'

TG_HYD_17_20_ROAD_SIDE_WINTER_PROBLEMS_PKG_3182388 reporter : sripathi.srinivas ( ) అసలే చలికాలం...ఆపై నిశారాత్రిలో రోడ్డుపక్కన నిద్రించడమంటే మామూలు విషయం కాదు. పదికాదు..ఇరవై కాదు...వందలాది మంది అభాగ్యులు చలికి వణుకుతూ పాదాచారులు నడుచుకుంటూ వెళ్లే దారిలోనే నిద్రిస్తున్నారు. చలికి తట్టుకోలేక రోడ్డుమీద దొరికే ప్లాస్టిక్ కవర్లనే కొందరు దుప్పట్లుగా కప్పుకుంటున్నారు. మరికొందరు శునకాలతో సహవాసం చేస్తూ...వాటిపక్కనే పడుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అర్థరాత్రి దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో కన్పించాయి. ఈటీవి పరిశీలనలో కన్పించాయి. Look.... వాయిస్ : చలికాలం అంటే ఇంట్లో ఉన్నవాళ్లే దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు. అలాంటిది భిక్షాటన చేసేవారు..అనాధనలు, అభాగ్యులు మాత్రం పుట్ పాత్ ల పైనే నిద్రిస్తుంటారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఆశ్రమం కల్పించినప్పటికీ...ఇంకా చాలాప్రాంతాల్లో ఇటువంటి వారు చలికి వణుకుతూనే ఉన్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని మహాంకాళి దేవాలయం, పారడైజ్ హోటల్ వీధి, గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి కూరగాయల మార్కెట్ వీధి, కోటీ, ఎంజీబీఎస్, జేబీఎస్, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటివారు కన్పించారు. రాత్రిపూట చలికి వణుకుతూ ఎవరైనా దుప్పట్లు తీసుకొస్తే..పరుగెత్తుకుంటూ వస్తున్నారు. హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ షాహిద్ చిన్న కిరాణ కొట్టు నడిపించుకుంటూ జీవితం వెళ్లదీస్తున్నాడు. ఉన్నదాంట్లో పేదలకు సాయం చేయాలని పరితపించాడు. అర్థరాత్రి రోడ్లపక్కన పడుకున్న అభాగ్యులకు దుప్పట్లు కప్పి ఔదార్యాన్ని చాటుకున్నాడు. బైట్ : మొహమ్మద్ షాహిద్, హిదాయత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. వాయిస్ : రాత్రి వేళల్లో రోడ్లపక్కన పడుకున్న వారిని పోలీసులు కూడా సరిగ్గా పడుకోనివ్వడంలేదని బాధితులు వాపోతున్నారు. అసలే ఇళ్లు లేవు..కనీసం రోడ్డు పక్కన పడుకుందామంటే..కూడా ఎప్పుడు ఎవరొచ్చి వెళ్లగొడతారో అని భయంభయంగా పడుకుంటామంటున్నారు. ఒక్కోసారి వాహనాలు వేగంగా వచ్చి మీదకు దూసుకొచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని రోడ్డుపక్కన ఆశ్రమం పొందుతున్నవారు తెలిపారు. అలా చనిపోయినా..పట్టించుకునే వారు ఉండరంటున్నారు. చనిపోయిన వారికోసం ఎవ్వరూ రాకపోవడంతో వారిని అలాగే తీసుకెళతారంటున్నారు. రోడ్లపక్క జీవితం...గాలిలో దీపం లాంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు గాలివస్తే..అప్పుడు దీపం ఆరిపోయినట్లు..తమ జీవితాలు కూడా అంతేనని పేర్కొంటున్నారు. ఎంతవరకు బతుకుతామో తెలియదు కానీ..బతికినంత కాలం..ఇలా రోడ్లమీదనే ఉంటామంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని రాత్రి వేళ పడుకునేందుకు ఆశ్రమం కల్పించాలని వేడుకుంటున్నారు. End.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.