ETV Bharat / state

హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు - హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

రోడ్డు ప్రమాదాల‌ను నివారించ‌డానికి భద్రతా నిబంధ‌న‌ల్ని ఆచ‌రించ‌డమే కాకుండా.. వాహ‌నాల‌ను న‌డిపేట‌ప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అన్నారు. ర‌వాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవ‌రి 2 వ‌ర‌కు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.

road safety week launching celebrations at hmda ground
హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
author img

By

Published : Jan 28, 2020, 7:25 AM IST


హైదరాబాద్​లోని హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. వాహనాలు, జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరగడం... భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్​... కారు ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీట్​బెల్ట్​ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎస్​ సోమేశ్​​కుమార్​, సినీనటి ఈషారెబ్బ పాల్గొన్నారు.

హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

ఇదీ చూడండి: కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్​లోని హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. వాహనాలు, జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరగడం... భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్​... కారు ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీట్​బెల్ట్​ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎస్​ సోమేశ్​​కుమార్​, సినీనటి ఈషారెబ్బ పాల్గొన్నారు.

హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

ఇదీ చూడండి: కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం

TG_HYD_09_28_ROAD_SAFTEY_WEEK_LAUNCHING_AV_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: feed from desk and taza whatsup ( ) రోడ్డు ప్రమాదాల‌ను నివారించ‌డానికి వాహ‌నదారులు భద్రతా నిబంధ‌న‌ల్ని ఆచ‌రించ‌డంతో పాటు వాహ‌నాల‌ను న‌డిపేట‌ప్పుడు తగు జాగ్రత్తల్ని పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ర‌వాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ర‌వాణా శాఖా ఆధ్వర్యంలో ఫిబ్రవ‌రి 2 వ‌ర‌కు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. హెచ్‌.ఎం.డి.ఎ. మైదానంలో జ‌రిగిన ఈ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌, సినీ నటి ఈషా రెబ్బ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో పాటు భ‌ద్రతా నిబంధ‌న‌ల్ని పాటించ‌డ‌క‌పోవ‌డంతోనే ఎక్కువ‌గా ప్రమాదాలు సంభ‌విస్తున్నాయ‌ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్‌ను ధరించాలని చెబుతూ కారు, త‌దిత‌ర వాహనాలను నడిపేటప్పుడు సీట్‌ బెల్టులు పెట్టుకొవ‌డం మ‌రిచిపోకూడ‌ద‌న్నారు. మ‌ద్యం సేవించి వాహనాలు నడిపిన‌ట్లయితే నడిపే వారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమాదాలు సంభవిస్తాయని, ట్రాఫ్డిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణాల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భ‌ద్రతా వారోత్సవాల‌ను పుర‌స్కరించుకుని ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న‌, ఛైత‌న్య కార్య‌క్రమాల‌లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.