మహారాష్ట్ర అహ్మద్నగర్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది తెలుగువారు గాయాలపాలయ్యారు.
ఏం జరిగిందంటే...
దైవ దర్శనం కోసం తెలుగువారంతా హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరారు. ఆరెంజ్ ప్రైవేటు ట్రావెల్స్లో వెళ్తుండగా... అహ్మద్నగర్ రాహురి తాలూకా వద్ద వాహనం పల్టీ కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించారు.
ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ పేరు ఖరారు'