రేవెళ్ల కల్యాణ్ డిప్యూటేషన్పై కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్మార్క్స్(సీజీపీడీటీఎం) ఉపకార్యదర్శిగా నియమితులయ్యారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్-2010 బ్యాచ్కు చెందిన కల్యాణ్... ప్రస్తుతం హైదరాబాద్లోని కస్టమ్స్లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కల్యాణ్ను ముంబయిలోని సీపీడీటీఎం డిప్యూటీ సెక్రటరీగా నియమకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్- నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు కల్యాణ్... నాలుగు సంవత్సరాలు లేదా దానికి ముందే ఏదైనా ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈయన జైపూర్లోని మాలావియా నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థలో ఫెలోషిప్ శిక్షణ కూడా పొందారు.
ఇదీ చూడండి: త్రీడి వీడియోలు చూసి పురుడు పోసిన యువకుడు