ETV Bharat / state

జూన్​ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన: రేవంత్​ రెడ్డి

author img

By

Published : May 20, 2020, 8:16 PM IST

సీఎం కేసీఆర్​పై పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు నీటి తరలింపు సామర్థ్యం పెంచితే విద్యుత్​ ప్రాజెక్టులు చచ్చిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవరణ దినోత్సవం రోజున ప్రాజెక్టుల వద్ద నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.

జూన్​ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన: రేవంత్​ రెడ్డి
జూన్​ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన: రేవంత్​ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే.. ఆ మూడింటిని కేసీఆర్‌ దారాదత్తం చేశారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నీళ్లను జగన్‌ మోహన్​ రెడ్డికి, నిధులు ఆంధ్రప్రాంత కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్‌ కుటుంబానికి ఇచ్చేసుకున్నారే కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.

పోతిరెడ్డిపాడు నీటి తరలింపు సామర్థ్యం పెంచితే విద్యుత్​ ప్రాజెక్టులు చచ్చిపోతాయని రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అపరమేధావైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ మాత్రం ఆలోచన తట్టలేదా అని నిలదీశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రాజెక్టుల వద్ద నిరసన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కార్యాచరణను ప్రకటిస్తారన్నారు.

జూన్​ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన: రేవంత్​ రెడ్డి

"పోతిరెడ్డిపాడుపై చర్చ పెట్టమనండి. నేను ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించా. దీనిమీద ప్రభుత్వం అభిప్రాయం చెప్పమనండి. నీటికి, విద్యుత్​కు ఎలాంటి నష్టం లేదని.. కాంగ్రెస్​కు కాదు.. ప్రజలకు చెప్పమనండి."

-రేవంత్‌ రెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే.. ఆ మూడింటిని కేసీఆర్‌ దారాదత్తం చేశారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నీళ్లను జగన్‌ మోహన్​ రెడ్డికి, నిధులు ఆంధ్రప్రాంత కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్‌ కుటుంబానికి ఇచ్చేసుకున్నారే కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.

పోతిరెడ్డిపాడు నీటి తరలింపు సామర్థ్యం పెంచితే విద్యుత్​ ప్రాజెక్టులు చచ్చిపోతాయని రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అపరమేధావైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ మాత్రం ఆలోచన తట్టలేదా అని నిలదీశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రాజెక్టుల వద్ద నిరసన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కార్యాచరణను ప్రకటిస్తారన్నారు.

జూన్​ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్​ నిరసన: రేవంత్​ రెడ్డి

"పోతిరెడ్డిపాడుపై చర్చ పెట్టమనండి. నేను ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించా. దీనిమీద ప్రభుత్వం అభిప్రాయం చెప్పమనండి. నీటికి, విద్యుత్​కు ఎలాంటి నష్టం లేదని.. కాంగ్రెస్​కు కాదు.. ప్రజలకు చెప్పమనండి."

-రేవంత్‌ రెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.