ETV Bharat / state

అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు

author img

By

Published : Jun 29, 2020, 10:57 PM IST

చందానగర్ సర్కిల్​లోని గురుకుల ట్రస్ట్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. మూడు గ్రౌండ్‌ లెవల్‌ స్ట్రక్చర్స్​ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిర్మాణంలో ఉన్న మరో ఆరు భవనాలు అధికారులు నేలమట్టం చేశారు.

Removal of ongoing illegal structures in ghmc area
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్ చందానగర్ సర్కిల్​లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు.

గురుకుల ట్రస్ట్ భూముల్లో చేపట్టిన మూడు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్స్​తో పాటు నిర్మాణంలో వున్న ఆరు భవనాలను నేలమట్టం చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఇక్కడి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని ఆయన వివరించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు

అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్ చందానగర్ సర్కిల్​లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు.

గురుకుల ట్రస్ట్ భూముల్లో చేపట్టిన మూడు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్స్​తో పాటు నిర్మాణంలో వున్న ఆరు భవనాలను నేలమట్టం చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఇక్కడి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని ఆయన వివరించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.