కొవిడ్ మహమ్మారి కారణంగా అవరోధాలు ఎదుర్కొంటోన్న స్టార్టప్లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ముందడుగు వేసింది. టీ-ఇంక్యుబేటర్స్ & ఎనేబులర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఓ 100 స్టార్టప్లను ఎంపిక చేసి మెంటరింగ్ చేసేందుకు రిజిగ్. హైదరాబాద్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కొవిడ్ విస్తరణతో వృద్ధి, మార్కెటింగ్లో నెమ్మదించిన స్టార్టప్లకు దన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఐటీ కార్యదర్శి జయేష్రంజన్ తెలిపారు.
ఫైనల్గా 100 స్టార్టప్లు
ఫలితంగా స్టార్టప్లు వాటి కార్యచరణ, వ్యాపార నిర్వహణకు మరింత పదునుపెట్టి ఫండింగ్, కార్పొరేట్ మార్కెటింగ్ అవకాశాలకు దారులు మరింత సుగుమం కానున్నాయి. కార్యక్రమంలో భాగంగా టీఎస్ఐసీ, టీ-ఇంక్యుబేటర్స్ స్టార్టప్, ఎకోసిస్టంలోని స్టార్టప్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. తయారీ, వ్యవసాయం, ఎఫ్ఎంసీజీ, ఫిన్టెక్, లైఫ్ సైన్సెస్, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాల నుంచి 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఫైనల్గా అన్ని రంగాలు కలగలపిన 100 స్టార్టప్ల మెంటరింగ్ ప్రోగ్రాంకు ఎంపిక చేశారు.
వారిని ఆర్థికంగా పరిపుష్టిం చేస్తాయి...
ఈ మెంటరింగ్ ప్రోగ్రాం ద్వారా స్టార్టప్లు, కొవిడ్ అనంతర గడ్డు పరిస్థితులు, అవరోధాలను అధిగమించేలా చేయటమే కాక, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయని జయేష్ రంజన్ అన్నారు. కంపెనీల భాగస్వామ్యం, ఇంక్యుబేటర్ల సహకారం తోడై స్టార్టప్ల వ్యాపార విధానాలకు పదును పెట్టి, పెట్టుబడులు, కార్పొరేట్ యాక్సెస్ కలగజేస్తారు. ఎదగాలనే ఆకాంక్షతో ఉవ్విళ్లూరే స్టార్టప్లకు.. స్టార్టప్ ఎకోసిస్టంలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని జయేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'