ETV Bharat / state

ట్రాక్​ మ్యాన్స్​ ఆందోళన... అలోక్​ కుమార్​ క్షమాపణ

author img

By

Published : May 21, 2019, 2:59 PM IST

ట్రాక్​ మ్యాన్స్​పై ఉన్నతాధికారుల వేధింపులు నిలిపివేయాలని సౌత్​ సెంట్రల్​ రైల్వే ఎంప్లాయిస్​ సంఘ్​ డిమాండ్ చేసింది.

ట్రాక్​ మ్యాన్స్​ ఆందోళన... అలోక్​ కుమార్​ క్షమాపణ
ట్రాక్​ మ్యాన్స్​ ఆందోళన... అలోక్​ కుమార్​ క్షమాపణ

హైదరాబాద్​ నాంపల్లి రైల్వే స్టేషన్​లో పలువురు ట్రాక్​ మ్యాన్స్​ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కొంతకాలంగా సీనియర్​ సెక్షన్​ ఇంజినీర్​ అలోక్​ కుమార్​ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, వేధిస్తున్నాడని ఆరోపించారు. కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన చెందారు. ఈ ఉదయం తమపై వేధింపులు నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. వీరికి పలు రైల్వే ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. అలోక్​ కుమార్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాయి. అలోక్​ కుమార్​ వచ్చి క్షమాపణ చెప్పగా ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.

ఇదీ చూడండి : విపక్షాల సమావేశానికి కర్ణాటక సీఎం డుమ్మా

ట్రాక్​ మ్యాన్స్​ ఆందోళన... అలోక్​ కుమార్​ క్షమాపణ

హైదరాబాద్​ నాంపల్లి రైల్వే స్టేషన్​లో పలువురు ట్రాక్​ మ్యాన్స్​ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కొంతకాలంగా సీనియర్​ సెక్షన్​ ఇంజినీర్​ అలోక్​ కుమార్​ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, వేధిస్తున్నాడని ఆరోపించారు. కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన చెందారు. ఈ ఉదయం తమపై వేధింపులు నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. వీరికి పలు రైల్వే ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. అలోక్​ కుమార్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాయి. అలోక్​ కుమార్​ వచ్చి క్షమాపణ చెప్పగా ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.

ఇదీ చూడండి : విపక్షాల సమావేశానికి కర్ణాటక సీఎం డుమ్మా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.