ETV Bharat / state

Rahul Gandhi Tour: రాహుల్‌ సభకు భారీ జనసమీకరణపై కాంగ్రెస్​ దృష్టి!

author img

By

Published : Apr 24, 2022, 7:36 PM IST

Rahul Gandhi Tour: రాహుల్‌ గాంధీ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే తాము ఏమి చేస్తామో.. రాహుల్‌ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది.

Rahul Gandhi Tour: రాహుల్‌ సభకు భారీ జనసమీకరణపై కాంగ్రెస్​ దృష్టి!
Rahul Gandhi Tour: రాహుల్‌ సభకు భారీ జనసమీకరణపై కాంగ్రెస్​ దృష్టి!

Rahul Gandhi Tour: రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నాయకులతో దిల్లీలో సమావేశమైన రాహుల్‌ గాంధీ... పీసీసీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వరంగల్‌ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు. ఆ తరువాత శనివారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా రాహుల్‌ గాంధీ పర్యటనను ఏ విధంగా విజయవంతం చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు.

జిల్లాల వారీగా ఇంఛార్జీలు: నాయకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు తీసుకుని క్రోడీకరించుకుని ముందుకు వెళ్లేందుకు పీసీసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రాహుల్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రొటోకాల్‌ కమిటీ, కో-ఆర్డినేషన్‌ కమిటీ, రిసెప్షన్​ కమిటీ, పబ్లిక్‌ మీటింగ్‌ మానిటరింగ్‌, స్టేజీ ఏర్పాట్ల కమిటీ, జనసమీకరణ కమిటీ, జిల్లాల వారీగా ఇంఛార్జీలను సైతం పీసీసీ నియమించింది. ఈ కమిటీలల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు దాదాపు అందరు సీనియర్లను భాగస్వామ్యం చేసింది.

భారీ జనసమీకరణ దిశగా: జనసమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రణాళికాబద్దంగా తరలింపు ఉండేట్లు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. వరంగల్‌ నగరానికి సమీపంలోని నియోజకవర్గాలు, మండలాలు, ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. దూరం నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నా.. అనుకున్న సంఖ్య సభకు వస్తారని అంచనా వేస్తున్నారు.

నాయకులను, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ నెల 25న కరీంనగర్‌, 26న ఖమ్మం, 27న నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు వీలుగా ఇంఛార్జీలను నియమిస్తారు. రాహుల్‌ సభలో ఏమేమి మాట్లాడాలి.. ఏయే అంశాలు అందులో పొందుపరచాలన్న దానిపై కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులతోపాటు రైతు సమస్యలపై అవగాహన కలిగిన నాయకులను భాగస్వామ్యం చేస్తున్నారు.

మరింత స్పష్టత అప్పుడే..: మరో వైపు రాష్ట్రంలోని 42వేల పోలింగ్‌ బూతుల నుంచి ప్రతి ఎన్‌రోలర్‌ తనతో కలిపి పది మందిని సభకు తీసుకొచ్చేట్లు చూడాలని ఇప్పటికీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ తర్వాత ఎస్పీజీ విభాగం అధికారులు ముందస్తుగా రాష్ట్రానికి వచ్చి పర్యటించిన అనంతరం.. రాహుల్‌ గాంధీ పర్యటన కార్యక్రమాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్తారా.. రోడ్డుమార్గాన వెళ్తారా.. అనేది ఎస్పీజీ అధికారుల పర్యటన అనంతరం స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

Rahul Gandhi Tour: రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నాయకులతో దిల్లీలో సమావేశమైన రాహుల్‌ గాంధీ... పీసీసీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వరంగల్‌ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు. ఆ తరువాత శనివారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా రాహుల్‌ గాంధీ పర్యటనను ఏ విధంగా విజయవంతం చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు.

జిల్లాల వారీగా ఇంఛార్జీలు: నాయకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు తీసుకుని క్రోడీకరించుకుని ముందుకు వెళ్లేందుకు పీసీసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రాహుల్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రొటోకాల్‌ కమిటీ, కో-ఆర్డినేషన్‌ కమిటీ, రిసెప్షన్​ కమిటీ, పబ్లిక్‌ మీటింగ్‌ మానిటరింగ్‌, స్టేజీ ఏర్పాట్ల కమిటీ, జనసమీకరణ కమిటీ, జిల్లాల వారీగా ఇంఛార్జీలను సైతం పీసీసీ నియమించింది. ఈ కమిటీలల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు దాదాపు అందరు సీనియర్లను భాగస్వామ్యం చేసింది.

భారీ జనసమీకరణ దిశగా: జనసమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రణాళికాబద్దంగా తరలింపు ఉండేట్లు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. వరంగల్‌ నగరానికి సమీపంలోని నియోజకవర్గాలు, మండలాలు, ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. దూరం నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నా.. అనుకున్న సంఖ్య సభకు వస్తారని అంచనా వేస్తున్నారు.

నాయకులను, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ నెల 25న కరీంనగర్‌, 26న ఖమ్మం, 27న నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు వీలుగా ఇంఛార్జీలను నియమిస్తారు. రాహుల్‌ సభలో ఏమేమి మాట్లాడాలి.. ఏయే అంశాలు అందులో పొందుపరచాలన్న దానిపై కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులతోపాటు రైతు సమస్యలపై అవగాహన కలిగిన నాయకులను భాగస్వామ్యం చేస్తున్నారు.

మరింత స్పష్టత అప్పుడే..: మరో వైపు రాష్ట్రంలోని 42వేల పోలింగ్‌ బూతుల నుంచి ప్రతి ఎన్‌రోలర్‌ తనతో కలిపి పది మందిని సభకు తీసుకొచ్చేట్లు చూడాలని ఇప్పటికీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ తర్వాత ఎస్పీజీ విభాగం అధికారులు ముందస్తుగా రాష్ట్రానికి వచ్చి పర్యటించిన అనంతరం.. రాహుల్‌ గాంధీ పర్యటన కార్యక్రమాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ నుంచి వరంగల్‌కు హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్తారా.. రోడ్డుమార్గాన వెళ్తారా.. అనేది ఎస్పీజీ అధికారుల పర్యటన అనంతరం స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.