ETV Bharat / state

'మాస్క్‌ లేకపోతే సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా వేస్తాం' - rachakonda cp mahesh bhagwat latest news

మాస్కు పెట్టుకోకపోతే ఏముంది... నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్టే!! మీరు మాస్కు పెట్టుకున్నారా...? లేదా? అనే నిఘా మీపై ఉంటుంది. అదేలా అనుకుంటున్నారా..? మాస్క్‌ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా విధిస్తున్నారు రాచకొండ పోలీసులు.

rachakonda cp mahesh bhagwat on masks
'మాస్క్‌ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా'
author img

By

Published : Apr 14, 2021, 5:07 PM IST

'మాస్క్‌ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా'

మాస్కు ధరించని వాహనదారులకు ఈ-చలాన్ ద్వారా కూడా జరిమానా విధిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించని వారిపై చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగానే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి సదరు వాహనదారునికి ఈ-చలాన్ విధిస్తున్నామన్నారు. కరోనా ఉదృతి దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. కమిషనరేట్​ పరిధిలో నిన్న ఒక్కరోజే మాస్కు ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామి వెల్లడించారు.

'మాస్క్‌ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా'

మాస్కు ధరించని వాహనదారులకు ఈ-చలాన్ ద్వారా కూడా జరిమానా విధిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించని వారిపై చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగానే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి సదరు వాహనదారునికి ఈ-చలాన్ విధిస్తున్నామన్నారు. కరోనా ఉదృతి దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. కమిషనరేట్​ పరిధిలో నిన్న ఒక్కరోజే మాస్కు ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామి వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.