ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం వీక్షించింది. కోచ్ గోపీచంద్, చాముండితో కలిసి ఆమె చిత్రం చూశారు. అన్నం పెట్టే రైతులను చిన్న చూపు చూడవద్దని ఈ చిత్రంలో చూపడం తననెంతో ఆకట్టుకుందని సింధు తెలిపారు. ప్రతిభ గల యువతులను ప్రోత్సహిస్తే ఎలా రాణిస్తారో చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ఉన్న ప్రతిభ గుర్తించి ప్రోత్సహిస్తే ఆయా రంగాల్లో వారు రాణిస్తారని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నారని సింధు చెప్పారు.
ఇదీ చూడండి :నేడు 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్లుక్