ETV Bharat / state

రేపు సాయంత్రం ఆన్​లైన్​లో రైతు సంఘాల సభ

author img

By

Published : May 7, 2021, 11:36 AM IST

కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆన్​లైన్​లో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపాయి.

farmers associations meeting
farmers associations meeting

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆన్​లైన్​లో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్​లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో.. ఆయా సంఘాల కార్యదర్శులు గోడ పత్రికను ఆవిష్కరించారు.

కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్​లుగా మార్చి కార్మిక హక్కులను కాల రాసిందని వారు మండి పడ్డారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో.. కేంద్రం నిర్లక్ష్యంతో అనేక మంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు సాయంత్రం 5 గంటలకు ఆన్​లైన్​లో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్​లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో.. ఆయా సంఘాల కార్యదర్శులు గోడ పత్రికను ఆవిష్కరించారు.

కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్​లుగా మార్చి కార్మిక హక్కులను కాల రాసిందని వారు మండి పడ్డారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో.. కేంద్రం నిర్లక్ష్యంతో అనేక మంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ టీకాపై అవగాహన కల్పించే 'భారీ విమానం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.