విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన తాజాగా హరితవిప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఎంపికయ్యారు.
వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున కొత్త మేలైన రకాలే కాకుండా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్, ఆహారోత్పత్తుల తయారీ రంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామంటున్న డాక్టర్ ప్రవీణ్రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత