ETV Bharat / state

'కేసీఆర్​కు​ మనుషుల ప్రాణాలకంటే కుక్కలే ముఖ్యం'

author img

By

Published : Sep 17, 2019, 1:03 PM IST

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి.. తెరాస పాలనపై ఘాటు విమర్శలు చేశారు.

'కేసీఆర్​కు​ మనుషుల ప్రాణాలకంటే కుక్కలే ముఖ్యం'

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అమరవీరులకు గుర్తింపు లేదని... సీఎం పెంపుడు కుక్కలకు, మజ్లిస్ పార్టీకి మాత్రమే గౌరవం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కారుపై మజ్లిస్ సవారీ చేస్తోందని ఎద్దేవా చేశారు. అమరవీరుల కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని... అలాంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రహ్లాద్​ జోషి అన్నారు.

'కేసీఆర్​కు​ మనుషుల ప్రాణాలకంటే కుక్కలే ముఖ్యం'

ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అమరవీరులకు గుర్తింపు లేదని... సీఎం పెంపుడు కుక్కలకు, మజ్లిస్ పార్టీకి మాత్రమే గౌరవం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కారుపై మజ్లిస్ సవారీ చేస్తోందని ఎద్దేవా చేశారు. అమరవీరుల కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని... అలాంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రహ్లాద్​ జోషి అన్నారు.

'కేసీఆర్​కు​ మనుషుల ప్రాణాలకంటే కుక్కలే ముఖ్యం'

ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.