కొవిడ్ జాగ్రత్తల నడుమ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 918 మంది దరఖాస్తు చేసుకోగా... 285 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడంతోపాటు.. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విద్యార్థులను పరీక్షించి లోపలికి అనుమతించారు. హన్మకొండలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 11 మంది విద్యార్థులను లోపలికి కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రంలోకి పంపించాలంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం