ETV Bharat / state

భాగ్యనగరంలో ముమ్మరంగా తనిఖీలు.. అనుమతులు లేకుంటే సీజ్!

author img

By

Published : May 22, 2021, 1:09 PM IST

భాగ్యనగరంలో లాక్​డౌన్​ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. దిల్​సుఖ్​నగర్ వద్ద చెక్​పోస్టు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.

police strictly inspections, hyderabad lock down
హైదరాబాద్​లో లాక్​డౌన్, హైదరాబాద్​లో పోలీసుల ముమ్మర తనిఖీలు

హైదరాబాద్​లో లాక్​డౌన్ మినహాయింపు సమయం ముగిసినా రోడ్లపైకి వస్తున్న వాహనాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దిల్​సుఖ్​నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్-కోఠి ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకుని... కేసులు నమోదు చేస్తున్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ, అనుమతులు ఉన్న ఇతర వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అందరూ విధిగా మాస్కును ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఒంటరితనమా..? ఇలా ఓడించేద్దాం..

హైదరాబాద్​లో లాక్​డౌన్ మినహాయింపు సమయం ముగిసినా రోడ్లపైకి వస్తున్న వాహనాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దిల్​సుఖ్​నగర్, మలక్ పేట, సరూర్ నగర్, చైతన్యపురిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్-కోఠి ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకుని... కేసులు నమోదు చేస్తున్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ, అనుమతులు ఉన్న ఇతర వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అందరూ విధిగా మాస్కును ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఒంటరితనమా..? ఇలా ఓడించేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.