ETV Bharat / state

Fake Seeds: నకిలీ విత్తనాలపై టాస్క్​ఫోర్స్ కొరడా.. ఈ ఏడాది ఎన్ని కేసులంటే?

author img

By

Published : Jun 23, 2021, 8:37 PM IST

నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారాలతో రైతుకు ఎటా మిగిలేది కన్నీరే. నయవంచనకు పాల్పడుతున్న నకిలీ విత్తన ముఠాలు ఏటా అన్నదాతల నడ్డి విరుస్తున్నాయి. ప్రతి ఏటా పోలీసులు దాడులు చేస్తున్నా నకిలీ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అసలు, నకిలీ అనే తేడా లేకుండా మార్కెట్​లో విత్తన ముఠాలు చెలరేగిపోతున్నాయి. వ్యాపారుల కాసుల కక్కుర్తి రైతన్నల పాలిట శాపంగా మారుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందాలు ఇప్పటివరకు 516 మందిని అరెస్ట్ చేసి 363 కేసులు నమోదుచేశాయి.

police raids on continuing seize fake seeds
నకిలీ విత్తనాలపై కొనసాగుతున్న దాడులు

రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన కేంద్రాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 363 కేసులు నమోదు చేసి 516 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేపట్టిన తనిఖీల్లో 5499 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్​ఫోర్స్​ బృందాలు దందాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

రాష్ట్రంలో ఉత్తర మండలం పరిధిలో 253 మందిపై 153 కేసులు, పశ్చిమ మండలం పరిధిలో 202 మందిపై 165 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు నమోదు చేసి 14మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 కేసులు నమోదు చేసిన పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6 కేసులు నమోదు కాగా.. ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. 2014 నుంచి గతేడాది వరకు 515 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది ఇప్పటి వరకే 363 కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే.. పోలీసులు ఏ స్థాయిలో నిఘా పెట్టారో అర్థమవుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి.

నల్గొండ జిల్లాలో భారీస్థాయిలో దందా

ఐదు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. దాదాపు 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి 13 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.

ప్రధాన నిందితుడు నంద్యాల వాసి

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధుసూదన్‌ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఈ నకిలీ విత్తన వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మధూసూదన్‌రెడ్డి నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడి పీడీ యాక్టు పెట్టినప్పటికీ మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. నైరుతి సీడ్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఎంజీ అగ్రోటెక్‌ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు వెల్లడించారు. నాణ్యతలేని విత్తనాలు సేకరించి రంగులు వేసి.. ఏమాత్రం అనుమానం రాకుండా క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉండేలా ఈ దందా సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బీజీ-3తో మహా డేంజర్​.. మనుషులకే కాదు పర్యావరణానికీ ముప్పే.!

రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన కేంద్రాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 363 కేసులు నమోదు చేసి 516 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేపట్టిన తనిఖీల్లో 5499 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్​ఫోర్స్​ బృందాలు దందాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

రాష్ట్రంలో ఉత్తర మండలం పరిధిలో 253 మందిపై 153 కేసులు, పశ్చిమ మండలం పరిధిలో 202 మందిపై 165 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు నమోదు చేసి 14మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 కేసులు నమోదు చేసిన పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6 కేసులు నమోదు కాగా.. ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. 2014 నుంచి గతేడాది వరకు 515 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది ఇప్పటి వరకే 363 కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే.. పోలీసులు ఏ స్థాయిలో నిఘా పెట్టారో అర్థమవుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి.

నల్గొండ జిల్లాలో భారీస్థాయిలో దందా

ఐదు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. దాదాపు 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి 13 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.

ప్రధాన నిందితుడు నంద్యాల వాసి

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధుసూదన్‌ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఈ నకిలీ విత్తన వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మధూసూదన్‌రెడ్డి నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడి పీడీ యాక్టు పెట్టినప్పటికీ మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. నైరుతి సీడ్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఎంజీ అగ్రోటెక్‌ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు వెల్లడించారు. నాణ్యతలేని విత్తనాలు సేకరించి రంగులు వేసి.. ఏమాత్రం అనుమానం రాకుండా క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉండేలా ఈ దందా సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బీజీ-3తో మహా డేంజర్​.. మనుషులకే కాదు పర్యావరణానికీ ముప్పే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.