ETV Bharat / state

అనవసరంగా హారన్ కొడితే కేసు నమోదు

అవసరం లేనపుడు కూడా హారన్ కొడుతూ, వింత వింత శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు పలువురు వాహన దారులు. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

author img

By

Published : Jul 21, 2019, 8:05 PM IST

అనవసరంగా హారన్ కొడితే కేసు నమోదు

ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి గురుచేస్తున్న వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇప్పటివరకూ మొత్తం 654 మందిపై కేసుల నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్​ బస్సులు, స్కూల్ బస్సులే ఉన్నాయి. వారం రోజుల పాటు ఈ డ్రైవ్​ను పోలీసులు నిర్వహించారు.

అనవసరంగా హారన్ కొడితే కేసు నమోదు

ఎయిర్ హారన్ కొట్టే 125 వాహనాలు, వివిధ రకాల హారన్ మోగిస్తున్న 424 వాహనాలు ఎక్కువగా ధ్వని చేస్తున్నాయన్నారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 105 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ మోత ఒక్కసారిగా వినిపించడంతో మిగిలిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోటారు వాహన చట్టం కింద ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బంది కరంగా హారన్లను మోగిస్తే తమకి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇదీ చూడండి : రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా

ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి గురుచేస్తున్న వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇప్పటివరకూ మొత్తం 654 మందిపై కేసుల నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్​ బస్సులు, స్కూల్ బస్సులే ఉన్నాయి. వారం రోజుల పాటు ఈ డ్రైవ్​ను పోలీసులు నిర్వహించారు.

అనవసరంగా హారన్ కొడితే కేసు నమోదు

ఎయిర్ హారన్ కొట్టే 125 వాహనాలు, వివిధ రకాల హారన్ మోగిస్తున్న 424 వాహనాలు ఎక్కువగా ధ్వని చేస్తున్నాయన్నారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 105 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ మోత ఒక్కసారిగా వినిపించడంతో మిగిలిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోటారు వాహన చట్టం కింద ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బంది కరంగా హారన్లను మోగిస్తే తమకి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇదీ చూడండి : రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా

Intro:ఫైల్: TG_KRN_41_21_ZP SAMAVESHAM_AVB_TS10038
రిపోర్టర్, లక్ష్మణ్ 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: వర్షాలు కురవక పోయినా ఈ సీజన్ లో పెద్దపెల్లి జిల్లా లోని రైతాంగం పంటల సాగు చేసేందుకు సాగునీరు అందిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ పుట్ట మధు తో కలిసి మొదటిసారిగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ దేవసేన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా ఎమ్మెల్సీ లు బాన ప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్రావు తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం అధికార పార్టీ సభ్యులతోపాటు కాంగ్రెస్ సభ్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పదేళ్ల క్రితం రాజకీయ పార్టీలు చేసిన కుట్రలవల్ల తెలంగాణలో వ్యవసాయం చేయడం ఇబ్బందిగా మారింది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తోడ్పడినట్లు వెల్లడించారు
బైట్: కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.