పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వటమే సరైన మార్గమని మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్తంగా అటవీ హక్కు చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అటవీ చట్టాలను అమలు చేయకపోగా ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరేలా చేస్తున్నదని ఆరోపించారు.
ఇవీ చూడండి: బావిలోకి దిగిన యువకులు ఎలా చనిపోయారు..!