ETV Bharat / state

'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ' - Speaker Pocharam Srinivas Reddy Tributes to Pv

మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి , మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గొని పీవీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు.

pv ghat
'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ'
author img

By

Published : Dec 23, 2020, 4:43 PM IST

Updated : Dec 23, 2020, 6:04 PM IST

పేదల అభివృద్ది కోసం భూసంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకే దక్కుతుందని శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడమంటే... ఆయనకు ఘన నివాళులర్పించినట్లేనని మండలి ఛైర్మన్​ అన్నారు.

పీవీ వర్ధంతి సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్​ పీవీ ఘాట్​లోని ఆయన సమాధి వద్ద పూలమాలతో నివాళులర్పించారు. భారత ఆర్థిక రూపురేఖలు మార్చినటువంటి మహానేత పీవీ అని సభాపతి పోచారం కొనియాడారు. పీవీ లేకపోయినా.. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, జ్ఞాపకాలు మన మధ్యనే ఉంటాయని పోచారం తెలిపారు. దేశానికి దిక్సూచి చూపించిన మహానేతగా పీవీని అభివర్ణించారు.

పేదల అభివృద్ది కోసం భూసంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకే దక్కుతుందని శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి పేర్కొన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడమంటే... ఆయనకు ఘన నివాళులర్పించినట్లేనని మండలి ఛైర్మన్​ అన్నారు.

పీవీ వర్ధంతి సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్​ పీవీ ఘాట్​లోని ఆయన సమాధి వద్ద పూలమాలతో నివాళులర్పించారు. భారత ఆర్థిక రూపురేఖలు మార్చినటువంటి మహానేత పీవీ అని సభాపతి పోచారం కొనియాడారు. పీవీ లేకపోయినా.. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, జ్ఞాపకాలు మన మధ్యనే ఉంటాయని పోచారం తెలిపారు. దేశానికి దిక్సూచి చూపించిన మహానేతగా పీవీని అభివర్ణించారు.

Last Updated : Dec 23, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.