ETV Bharat / state

ప్రధానికి బతుకమ్మ, బోనాల విశిష్టతను వివరించిన గవర్నర్..

author img

By

Published : Jul 4, 2022, 8:03 PM IST

RAJBHAVAN: బతుకమ్మ, బోనాల ప్రాశస్త్యం గురించి ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై వివరించారు. భాగ్యనగర పర్యటనకు వచ్చిన ప్రధాని నిన్న రాత్రి రాజ్​భవన్​లో బస చేశారు. ఈరోజు ఏపీ పర్యటనకు బయలుదేరే ముందు ఆయన రాజ్​భవన్​ ప్రాంగణంలో మొక్కను నాటారు.

ప్రధాని నరేంద్రమోదీ
ప్రధాని నరేంద్రమోదీ

RAJBHAVAN: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ, బోనాల గురించి ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ నిన్న రాత్రి రాజ్​భవన్ అతిథిగృహంలో బస చేశారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయల్దేరేముందు.. రాజ్ భవన్ ప్రాంగణంలో మోదీ మొక్క నాటారు. ఆధ్యాత్మిక, ఔషధ ప్రాధాన్యం ఉన్న కదంబ మొక్కను ఆయన నాటారు.

అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ, బోనాల ప్రాశస్త్యం, ప్రాముఖ్యతను గవర్నర్ ప్రధానికి వివరించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారని గవర్నర్ తమిళిసైని, రాజ్ భవన్ సిబ్బందిని మోదీ అభినందించారు.

RAJBHAVAN: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ, బోనాల గురించి ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ నిన్న రాత్రి రాజ్​భవన్ అతిథిగృహంలో బస చేశారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయల్దేరేముందు.. రాజ్ భవన్ ప్రాంగణంలో మోదీ మొక్క నాటారు. ఆధ్యాత్మిక, ఔషధ ప్రాధాన్యం ఉన్న కదంబ మొక్కను ఆయన నాటారు.

అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ, బోనాల ప్రాశస్త్యం, ప్రాముఖ్యతను గవర్నర్ ప్రధానికి వివరించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారని గవర్నర్ తమిళిసైని, రాజ్ భవన్ సిబ్బందిని మోదీ అభినందించారు.

ప్రధానికి బతుకమ్మ, బోనాల విశిష్టతను వివరించిన గవర్నర్..

ఇదీ చదవండి: భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

'తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలి.. ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేయకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.