ETV Bharat / state

pjtsau counselling dates 2021: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ ఎప్పుడంటే? - తెలంగాణ వార్తలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల కౌన్సిలింగ్(pjtsau counselling dates 2021) తేదీలు ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. కౌన్సెలింగ్ విధానాన్ని వివరించారు.

pjtsau counselling dates 2021, pjtsau updates
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్‌ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్తలు కోర్సుల కౌన్సిలింగ్,
author img

By

Published : Oct 26, 2021, 7:51 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం రైతు కోటా కింద కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) జరగనుంది. నవంబరు 1 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ (హానర్స్ ) కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ కౌన్సెలింగ్ హాజరుకావాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) ప్రక్రియ జరగనుందని వెల్లడించారు.

బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సులో 16 సీట్లు, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సులో- 16 సీట్లు, బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో- 30 సీట్లకు టీఎస్ ఎంసెట్‌-2021 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో రైతు కోటాలో సీటు పొందాలంటే అభ్యర్థి కనీసం 4 ఏళ్లపాటు విధిగా గ్రామీణ ప్రాంతంలోని విద్యాసంస్థలో చదివి ఉండాలని తెలిపారు. కనీసం ఒక ఎకరం విస్తీర్ణం భూమి... తల్లి లేదా తండ్రి అభ్యర్థి పేరు మీద కలిగి ఉండాలని చెప్పారు. ఇక పూర్తి పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ : www.pjtsau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం రైతు కోటా కింద కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) జరగనుంది. నవంబరు 1 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ (హానర్స్ ) కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ కౌన్సెలింగ్ హాజరుకావాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) ప్రక్రియ జరగనుందని వెల్లడించారు.

బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సులో 16 సీట్లు, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సులో- 16 సీట్లు, బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో- 30 సీట్లకు టీఎస్ ఎంసెట్‌-2021 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో రైతు కోటాలో సీటు పొందాలంటే అభ్యర్థి కనీసం 4 ఏళ్లపాటు విధిగా గ్రామీణ ప్రాంతంలోని విద్యాసంస్థలో చదివి ఉండాలని తెలిపారు. కనీసం ఒక ఎకరం విస్తీర్ణం భూమి... తల్లి లేదా తండ్రి అభ్యర్థి పేరు మీద కలిగి ఉండాలని చెప్పారు. ఇక పూర్తి పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ : www.pjtsau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: etela campaign: 'ప్రేమతో ఓట్లు అడగాల్సింది పోయి తెరాస బెదిరిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.