కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆయుష్ విభాగం అడిషనల్ డైరెక్టర్ డా. లింగరాజు సూచించారు. హోమియోలోని కొన్ని రకాల మందులతో వైరస్ను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి ఆయా మందులను సిఫార్స్ చేసినట్లు ఆయన తెలిపారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్