ETV Bharat / state

కళ్లముందే భర్త మృతి... ఏమి చేయలేని నిస్సాయతతో

author img

By

Published : Jul 19, 2020, 1:41 PM IST

మాయదారి కరోనా ధాటికి అయినవారు కళ్లెదుటే కట్టెలుగా మారుతుంటే చూసి తట్టుకోలేని గుండెలు పగులుతున్నాయి. కల్లెదుటే భర్త మరణించినా... అంత్యక్రియలకు కూడా నిర్వహించలేకుపోతున్నామని భార్య రోదిస్తున్న ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

person-dead-with-corona-in-kurnool
కళ్లముందే భర్త మృతి... ఏమి చేయలేని నిస్సాయత

మహమ్మారి వైరస్‌ కర్కశత్వానికి దర్పణంగా నిలుస్తున్నాయి కొన్ని ఘటనలు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం ఆర్టీసీ బస్టాండు సమీపంలో 3 రోజుల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆయన వయసు 50 ఏళ్లలోపే ఉండటంతో ఇంటి సమీపంలో ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉంచారు. శనివారం అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించింది. ప్రైవేటు అంబులెన్సును పిలిపించి అందులోకి ఎక్కిస్తుండగానే చనిపోయారు. ఒక వైపు భర్త మృతదేహం, మరో వైపు పీపీఈ కిట్‌ ధరించి రోదిస్తున్న భార్య... ఆ దృశ్యం స్థానికులను కలచివేసింది. పురపాలిక సిబ్బంది సహకారంతో స్థానికులు అంత్యక్రియలు పూర్తిచేశారు.

మహమ్మారి వైరస్‌ కర్కశత్వానికి దర్పణంగా నిలుస్తున్నాయి కొన్ని ఘటనలు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం ఆర్టీసీ బస్టాండు సమీపంలో 3 రోజుల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆయన వయసు 50 ఏళ్లలోపే ఉండటంతో ఇంటి సమీపంలో ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉంచారు. శనివారం అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించింది. ప్రైవేటు అంబులెన్సును పిలిపించి అందులోకి ఎక్కిస్తుండగానే చనిపోయారు. ఒక వైపు భర్త మృతదేహం, మరో వైపు పీపీఈ కిట్‌ ధరించి రోదిస్తున్న భార్య... ఆ దృశ్యం స్థానికులను కలచివేసింది. పురపాలిక సిబ్బంది సహకారంతో స్థానికులు అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇదీ చదవండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.