ETV Bharat / state

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన... వివాహ వేడుకలపై పోలీసుల నిఘా

కొవిడ్ పట్ల నిర్లక్ష్యమే కొంప ముంచుతోంది. కొందరి బాధ్యతారాహిత్యం మరికొందరికి వైరస్‌ సోకేందుకు కారణమవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తికి ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల్లో దాదాపు ఒకే కుటుంబం, కాలనీలకు చెందినవారే ఉండడం దీనికి నిదర్శనం. పాతబస్తీలో బంగారు ఆభరణాల తయారీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే కేసులు పెరుగుతున్నాాయి. ఈ నేపథ్యంలో రాబోయే పెళ్లిళ్ల సీజన్‌పై పోలీసులు మరింత నిఘా పెంచారు.

author img

By

Published : May 3, 2021, 8:37 AM IST

covid in hyderabad
నగరంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలతోనే వైరస్‌ వ్యాప్తి

కళ్లెదుట కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతోంది. భారీమూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్‌లో కరోనా వ్యాప్తికి ఇదే కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనుమానితుల్లో స్నేహితులు, కుటుంబసభ్యులు, ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే సిబ్బంది వరుసగా కొవిడ్‌ లక్షణాలతో హోం క్వారంటైన్‌కు చేరారు. దుకాణ యజమాని స్వల్పలక్షణాలతో బాధపడుతూ వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దేందుకు రావటమే దీనికి కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రాయదుర్గం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ వేడుక 10 కుటుంబాలను హోం క్వారంటైన్‌లోకి నెట్టేసింది.

రూటుమార్చి ఔషధాల విక్రయాలు

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ దళారులకు కాసులు కురిపిస్తోంది. పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావటంతో విక్రేతలు రూటుమార్చారు. పరిచయం ఉన్న ఆసుపత్రుల్లో కాంపౌండర్లు, ఇతర వైద్యసిబ్బందితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. నల్లబజారులో ఒక్క రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొనుగోలు చేయాలంటే మూడు దఫాలుగా పరిశీలన చేస్తున్నారు. కరోనా రోగి అని నిర్ధారించుకున్న తరువాత ఇంజక్షన్‌ దొరికే వివరాలు చెబుతారు. మరో వ్యక్తి దాని ఖరీదు, ఎక్కడ ఏయే సమయాల్లో లభిస్తుందనే సమాచారం అందిస్తాడు. సొమ్ము చేతిలో పడ్డాకే మూడో వ్యక్తి ఇంజక్షన్‌ చేతికిస్తాడు.

కొద్దిమందితోనే శుభకార్యాలు..

గ్రేటర్‌ పరిధిలో తాజాగా 1546 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఒకే కుటుంబాలకు చెందిన వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీలో బంగారు ఆభరణాల తయారీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తుంటారు. వీరంతా ఒకే చోట బస చేస్తుంటారు. ఇప్పుడదే ప్రమాదకరంగా మారింది. ఒకరి ద్వారా మరొకరికి సోకుతోంది. ఇటీవల సుమారు 15 మంది కొవిడ్‌ బారినపడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరి ద్వారా ఇంకెంతమందికి సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. నగర పరిధిలో రాబోయే వారం రోజుల్లో భారీగా వివాహాలు జరగబోతున్నాయి. గస్తీలో భాగంగా కొన్ని కాలనీల్లో వేడుకలు జరగబోయే ఇంటి యజమానుల వివరాలను పోలీసులు సేకరించి, జాగ్రత్తలు, నిబంధనలు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈటల రాజేందర్ ఉద్వాసనతో ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ

కళ్లెదుట కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతోంది. భారీమూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్‌లో కరోనా వ్యాప్తికి ఇదే కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనుమానితుల్లో స్నేహితులు, కుటుంబసభ్యులు, ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే సిబ్బంది వరుసగా కొవిడ్‌ లక్షణాలతో హోం క్వారంటైన్‌కు చేరారు. దుకాణ యజమాని స్వల్పలక్షణాలతో బాధపడుతూ వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దేందుకు రావటమే దీనికి కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రాయదుర్గం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ వేడుక 10 కుటుంబాలను హోం క్వారంటైన్‌లోకి నెట్టేసింది.

రూటుమార్చి ఔషధాల విక్రయాలు

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ దళారులకు కాసులు కురిపిస్తోంది. పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావటంతో విక్రేతలు రూటుమార్చారు. పరిచయం ఉన్న ఆసుపత్రుల్లో కాంపౌండర్లు, ఇతర వైద్యసిబ్బందితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. నల్లబజారులో ఒక్క రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొనుగోలు చేయాలంటే మూడు దఫాలుగా పరిశీలన చేస్తున్నారు. కరోనా రోగి అని నిర్ధారించుకున్న తరువాత ఇంజక్షన్‌ దొరికే వివరాలు చెబుతారు. మరో వ్యక్తి దాని ఖరీదు, ఎక్కడ ఏయే సమయాల్లో లభిస్తుందనే సమాచారం అందిస్తాడు. సొమ్ము చేతిలో పడ్డాకే మూడో వ్యక్తి ఇంజక్షన్‌ చేతికిస్తాడు.

కొద్దిమందితోనే శుభకార్యాలు..

గ్రేటర్‌ పరిధిలో తాజాగా 1546 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఒకే కుటుంబాలకు చెందిన వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీలో బంగారు ఆభరణాల తయారీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తుంటారు. వీరంతా ఒకే చోట బస చేస్తుంటారు. ఇప్పుడదే ప్రమాదకరంగా మారింది. ఒకరి ద్వారా మరొకరికి సోకుతోంది. ఇటీవల సుమారు 15 మంది కొవిడ్‌ బారినపడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరి ద్వారా ఇంకెంతమందికి సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. నగర పరిధిలో రాబోయే వారం రోజుల్లో భారీగా వివాహాలు జరగబోతున్నాయి. గస్తీలో భాగంగా కొన్ని కాలనీల్లో వేడుకలు జరగబోయే ఇంటి యజమానుల వివరాలను పోలీసులు సేకరించి, జాగ్రత్తలు, నిబంధనలు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈటల రాజేందర్ ఉద్వాసనతో ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.